Narendra Modi : వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ రూపొందించాం
- By Sudheer Published Date - 02:41 PM, Thu - 1 February 24
కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సమర్పించిన మధ్యంతర బడ్జెట్(Interim Budget) అభివృద్ధి చెందిన భారత్ పునాదిని పటిష్టం చేసే ‘గ్యారంటీ’ని అందిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) గురువారం వ్యాఖ్యానించారు. బడ్జెట్ తరువాత టెలివిజన్ ప్రసంగంలో ప్రధాని మోడీ… అభివృద్ధి చెందిన భారతదేశానికి నాలుగు స్తంభాలు, అవి యువకులు, పేదలు, మహిళలు మరియు రైతులను సాధికారత చేస్తానని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
”ఇది భారతదేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్,” అని ఆయన అన్నారు, ఇది యువ భారతదేశపు యువ ఆకాంక్షలకు ప్రతిబింబం అని అన్నారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ. 1 లక్ష కోట్ల నిధిని ప్రకటించడాన్ని ఉటంకిస్తూ, ”చారిత్రక” బడ్జెట్ స్టార్టప్లకు రాయితీలను కూడా అందించిందని ఆయన పేర్కొన్నారు. ద్రవ్య లోటును అదుపులో ఉంచుతూనే రూ.11.11 లక్షల కోట్ల భారీ మూలధన వ్యయానికి కేటాయింపులు ఉన్నాయని ఆయన చెప్పారు.
అందరి అవసరాలు తీర్చే బడ్జెట్ ఇదని ప్రధాని మోడీ అన్నారు. యువతీ యువకుల కోసమే ఈ బడ్జెట్ అని, వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని మోడీ అన్నారు. అందరి అవసరాలు తీర్చే బడ్జెట్ ఇది అని ఆయన పేర్కొన్నారు. మౌళిక వసతుల కోసం రూ.11 వేల కోట్లు కేటాయించామని ఆయన తెలిపారు. కోటి గృహాలకు ఉచిత సోలార్ విద్యుత్, పేదలు, రైతులకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరమన్నారు మోడీ. అంతేకాకుండా.. రూ. 2.20 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణం, విదేశీ పెట్టుబడులకు ఇది స్వర్ణ యుగమన్నారు. రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణం. విద్యుత్ బిల్లుల నుంచి విముక్తికి కొత్త సోలార్ పథకం. మౌళిక వసతుల రంగానికి రూ.11.11 లక్షల కోట్లు. 9-18 ఏళ్ల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు తీసుకునేవిధంగా బడ్జెట్లో కీలక అంశాలు ఉన్నాయన్నారు. బడ్జెట్ పేద, మధ్యతరగతి వర్గాలకు సాధికారత కల్పిస్తుందని, యువతకు లెక్కలేనన్ని ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.
Read Also : Budget 2024 : రైతులకు, సామాన్యులకు షాక్ ఇచ్చిన బడ్జెట్
Related News
Modi : మోడీ ఏపీ టూర్ డేట్స్ ప్రకటించిన బిజెపి..
ప్రధాని మోడీ మరోసారి ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు బిజెపి అధిష్టానం మోడీ పర్యటనకు సంబదించిన తేదీలను ప్రకటించింది