Badrinath Highway: చార్ ధామ్ యాత్ర భక్తులకు అలర్ట్.. బద్రీనాథ్ హైవే మూసివేత
ఉత్తరాఖండ్లోని చమోలి సమీపంలో పర్వతం నుండి శిధిలాలు పడటంతో బద్రీనాథ్ హైవే (Badrinath Highway) మూసివేయబడింది. కొండ శిథిలాలు రోడ్డుపై పడడంతో బద్రీనాథ్ హైవేపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
- By Gopichand Published Date - 12:09 PM, Sun - 30 April 23
ఉత్తరాఖండ్లోని చమోలి సమీపంలో పర్వతం నుండి శిధిలాలు పడటంతో బద్రీనాథ్ హైవే (Badrinath Highway) మూసివేయబడింది. కొండ శిథిలాలు రోడ్డుపై పడడంతో బద్రీనాథ్ హైవేపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చమోలి (Chamoli) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్వాలి చమోలి ప్రాంతంలోని బజ్పూర్లోని పర్వతం నుండి శిధిలాలు పడటంతో బద్రీనాథ్ హైవే మూసివేయబడింది. దీంతో దారిలో వాహనాలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, బద్రీనాథ్లలో ప్రతికూల వాతావరణం యాత్రికులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
సమాచారం ప్రకారం.. కేదార్నాథ్, బద్రీనాథ్లలో ప్రతికూల వాతావరణం కారణంగా శ్రీనగర్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. భక్తుల బస కోసం శ్రీనగర్లో తగిన ఏర్పాట్లు చేశారు. వాతావరణం అనుకూలించి, బద్రీనాథ్ హైవేపై చెత్తను తొలగించిన తర్వాత ప్రయాణికులు ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తారు. బద్రీనాథ్ ధామ్లో మంచు కురుస్తోంది. చివరి రోజైన శనివారం కూడా మంచు కురిసి వర్షం కురిసింది. వాతావరణ శాఖ (IMD) ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో ఈ రోజు అంటే ఏప్రిల్ 30, మే 1 తేదీలలో వర్షం, మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Also Read: Kanimozhi vs Annamalai: తమిళనాడులో నోటీసుల గేమ్
Uttarakhand | The Badrinath highway has been closed due to debris coming from the hill in Bazpur under Kotwali Chamoli area: Chamoli Police
(Video source: Chamoli Police Twitter handle) pic.twitter.com/rUhbhR6qFV
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 30, 2023
ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు కేదార్నాథ్-బద్రీనాథ్ ధామ్ను సందర్శిస్తుంటారు. ఈసారి కూడా వేలాది మంది భక్తులు ఉత్తరాఖండ్ చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా.. ఈ మధ్య మారుతున్న వాతావరణం చార్ధామ్ యాత్రకు ఆటంకంగా మారుతోంది. ఏప్రిల్ 27న బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరిచిన తర్వాత దేశంలోని నాలుగు పవిత్ర స్థలాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ధామ్లకు ప్రయాణం ప్రారంభమైంది. యాత్ర ప్రారంభం కావడంతో రాష్ట్ర పోలీసులు కూడా యాత్రికులకు అన్ని రకాల సహాయసహకారాలు అందించి పుణ్యక్షేత్రాలకు చేరుకునేలా చర్యలు చేపట్టారు.
Related News
Patanjali Products : బాబా రాందేవ్కు షాక్.. 14 పతంజలి ప్రోడక్ట్స్ లైసెన్సులు రద్దు
Patanjali Products : యోగా గురువు బాబా రాందేవ్ కంపెనీ ‘పతంజలి’కి మరో ఎదురుదెబ్బ తగిలింది.