HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Us Defence Report Mentions Chinese Village In Arunachal

India-China: మోడీ అబద్ధాలను సాక్ష్యాలతో బయటపెట్టిన అమెరికా

భార‌త్, చైనా స‌రిహ‌ద్దులు వ‌ద్ద జ‌రిగిన ఆక్ర‌మ‌ణ గురించి మోడీ ప్ర‌భుత్వం నిజాల‌ను చెప్ప‌లేక‌పోతోంది. కొన్ని వేల కిలోమీట‌ర్లు చైనా సైన్యం వాస్త‌వాధీన రేఖ‌ను దాటుకుని వ‌చ్చాయ‌ని కాంగ్రెస్ చెబుతోంది.

  • Author : Hashtag U Date : 06-11-2021 - 1:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

భార‌త్, చైనా స‌రిహ‌ద్దులు వ‌ద్ద జ‌రిగిన ఆక్ర‌మ‌ణ గురించి మోడీ ప్ర‌భుత్వం నిజాల‌ను చెప్ప‌లేక‌పోతోంది. కొన్ని వేల కిలోమీట‌ర్లు చైనా సైన్యం వాస్త‌వాధీన రేఖ‌ను దాటుకుని వ‌చ్చాయ‌ని కాంగ్రెస్ చెబుతోంది. ఆ అంశంపై గ‌త ఏడాది జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో వాడీవేడి చ‌ర్చ జ‌రిగింది. ఒక్క అంగుళం భూమి కూడా ఆక్ర‌మ‌ణ‌కు గురికాలేద‌ని మోడీ చెప్పుకొచ్చాడు. ఆయ‌న చెబుతోన్న మాట‌ల‌న్నీ అబ‌ద్ధ‌మ‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిల‌దీశాడు. శాటిలైట్ పిక్చ‌ర్స్ ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశాడు. దేశ భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశం అంటూ మోడీ స‌ర్కార్ దాట‌వేసింది. కానీ, సంచ‌ల‌న వాస్త‌వాల‌ను అమెరికా ఆల‌స్యంగా బ‌య‌ట‌పెట్టింది.

Also Read :  డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహ‌నాల‌ను సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు లేదు

వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద భార‌త భూభాగంలోకి చైనా కొన్ని కిలో మీట‌ర్లు లోప‌ల‌కు వ‌చ్చింద‌ని తాజాగా అమెరికా ర‌క్ష‌ణ విభాగం త‌న వార్షిక నివేదిక‌లో పొందుప‌రిచింది. చైనా దేశ‌స్తులు క‌నీసం 100 ఇళ్ల‌తో కూడా ఒక గ్రామాన్ని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిర్మించార‌ని తేల్చింది. ఆ మేర‌కు యూఎస్ కాంగ్రెస్ కు అమెరికా ర‌క్ష‌ణ‌శాఖ ఒక నివేదిక‌‌ను అందించ‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.అమెరికా వార్షిక రిపోర్ట్ ప్ర‌కారం అరుణాచ‌‌ల్ ప్ర‌దేశ్ తూర్పు స‌రిహ‌ద్దుల్లోని వాస్త‌వాధీన రేఖ‌, టిబెట్ స్వ‌యంప్ర‌తిప‌త్తి కలిగిన ప్ర‌దేశంలో ఒక గ్రామాన్ని చైనా నిర్మించింది. గ‌త ఏడాది 100 ఇళ్ల‌ను చైనా దేశ‌స్తులు భార‌త భూభాగంలో క‌ట్టుకున్నారు. చైనా, భార‌త్ సైన్యం న‌డుమ 1962లో ఘ‌ర్ష‌ణ జ‌రిగిన ప్రాంతంగా గుర్తించింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ అప్ప‌ర్ సుబ‌న్స‌రి రాష్ట్రంలోని సార్చు న‌ది ఒడ్డున ఆ గ్రామం ప్ర‌స్తుతం ఉంది.

ఒక‌ప్పుడు ఆ ప్రాంతంలో చైనాకు చెందిన సైన్యం పోస్ట్ ఒక‌టి ఉండేది. గ‌త ఏడాది ఎల్ఏసీ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ త‌రువాత ఆ ప్రాంతంలో చైనా ఏకంగా గ్రామాన్ని నిర్మించ‌డంతో పాటు భార‌త భూభాగంలో రోడ్ల‌ను ఇత‌ర‌త్రా మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తోంది. తూర్పు విభాగం ఆర్మీ క‌మాండ్ చీఫ్ ఇటీవ‌‌ల చైనా నిర్మించిన గ్రామంతో పాటు అక్క‌డ జ‌రుగుతోన్న వివిధ నిర్మాణాల‌ను ప‌రిశీలించారు. ప‌లు విధాలుగా ఉప‌యోగిచుకునేందుకు అక్క‌డ రోడ్ల‌ను నిర్మిస్తున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే.

భ‌విష్య‌త్ లో చైనా ఆర్మీ స్థిరంగా ఉండేలా ఆ నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని కమాండ చీఫ్ అభిప్రాయ‌ప‌డ్డారు. సిక్కిం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ప‌రిధిలోని ఎల్ఏసీ వెంబ‌డి గ్రామాల‌ను ఏర్పాటు చేయ‌డం వెనుక కొన్ని బిలియ‌న్ డాల‌ర్ల వ్యాపారం టిబెట్ ప్రాంతంలో చేయాల‌ని చైనా భావిస్తోంది. రైల్వే , రోడ్ల సౌక‌ర్యం క‌ల్పించ‌డం ద్వారా దాదాపు 600 గ్రామాల‌ను వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి ఏర్పాటు చేయాల‌ని చైనా మాస్ట‌ర్ ప్లాన్ వేసింది.
ల‌డక్ వ‌ద్ద ప‌‌శ్చిమ హిమాల‌య ప్రాంతంలో కొన్ని వేల కిలోమీట‌ర్లు భార‌త్ వైపు చైనా సైన్యం చొచ్చుకుని వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో గ‌త ఏడాది ఇండియా, చైనా సైన్యం మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌త్ సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు. చైనాకు చెందిన సుమారు 40 మంది మ‌ర‌ణించ‌డం లేదా గాయ‌ప‌డ‌డం జ‌రిగింది. గ‌త ఏడాది ఫిబ్ర‌వరిలో గాల్వాన్ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో ఎంత మంది గాయ‌ప‌డ్డారో..స్ప‌ష్టంగా ఇప్ప‌టికీ బ‌య‌ట‌కు రాలేదు. ఎల్ ఏసీ పొడ‌వునా చైనా సైన్యం భారీగా మోహ‌రించింది. స‌రిహ‌ద్దుల వ‌ద్ద జ‌రుగుతోన్న నిర్మాణాలు, భార‌త్ భూభాగంలోని చైనా గ్రామాల‌కు రక్ష‌ణ‌గా డ్రాగ‌న్ సైన్యం నిలుస్తోంది. సైన్యాన్ని ఉప‌సంహ‌రించుకోవ‌డానికి చైనా అంగీక‌రించ‌డంలేదు. పైగా , ఎల్ఏసీ వ‌ద్ద భార‌త్ రెచ్చ‌గొడుతున్న కార‌ణంగా సైన్యాన్ని మోహ‌రించామ‌ని చెబుతోంది. ఇలాంటి ప‌రిణామాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు మోడీ స‌ర్కార్ దాచింది. భార‌త్ , చైనా స‌రిహ‌ద్దు వ‌ద్ద ఏం జ‌రుగుతుందో ప్ర‌పంచానికి తెలియ‌చేస్తూ అమెరికా ర‌క్ష‌ణ‌శాఖ నివేదిక‌ను తయారు చేయ‌డం గ‌మ‌నార్హం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arunachal
  • china
  • pm modi
  • rahul gandhi

Related News

Rahul Kerala

Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది

  • Pm Modi Hits Back At Rahul

    Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • T20 World Cup 2026

    ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌?

  • India

    ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Digital Cards

    Digital Cards: రైతులకు ప్రధాని మోడీ శుభవార్త

Latest News

  • మన శ‌రీరానికి రోజుకు ఎంత ప్రోటీన్ అవసరమో తెలుసా?

  • ముహుర్తం ఖరారు.. మార్చి 23న అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..!

  • విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు

  • IPL 2026: ఐపీఎల్ 2026..తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ X ఆర్సీబీ

  • Audi India price hike: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఆడి లగ్జరీ కార్ల ధరలు

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd