HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Us Clears Sale Of 31 Mq 9b Armed Drones To India For Nearly 4 Billion Dollars

MQ 9B : ఇండియాకు 31 ‘ఎంక్యూ-9బీ’ డ్రోన్లు .. ఎలా పనిచేస్తాయో తెలుసా ?

MQ 9B :అవి అలాంటి ఇలాంటి డ్రోన్లు కాదు. ఆయుధాలను కూడా తమతో తీసుకెళ్లగలవు.

  • By Pasha Published Date - 07:14 AM, Fri - 2 February 24
  • daily-hunt
Mq 9b Drones
Mq 9b Drones

MQ 9B :అవి అలాంటి ఇలాంటి డ్రోన్లు కాదు. ఆయుధాలను కూడా తమతో తీసుకెళ్లగలవు. ఓ వైపు డ్రోన్లలా పనిచేస్తూనే.. మరోవైపు బాంబుల వర్షం కూడా కురిపించగలవు. గ్రౌండ్ నుంచి ఆర్మీ ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ యుద్ధ విమానంలా వైమానిక దాడులను  చేయగలవు. ఈ ప్రత్యేకతలన్నీ ‘ఎంక్యూ-9బీ’ (MQ-9B) రకం సాయుధ డ్రోన్లకు సంబంధించినవి. ఈ మోడల్‌కు చెందిన 31 ‘ఎంక్యూ-9బీ’ (MQ-9B) డ్రోన్లను  భారత్‌కు విక్రయించేందుకు అమెరికా పచ్చజెండా ఊపింది. దాదాపు రూ.33 వేల కోట్ల ప్రతిపాదిత ఒప్పందానికి అగ్రరాజ్యం ఆమోద ముద్ర వేసింది. గతేడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ డ్రోన్ల ఒప్పందాన్ని ప్రకటించారు.

రూ.33 వేల కోట్ల అంచనా వ్యయంతో..

‘‘రూ.33 వేల కోట్ల అంచనా వ్యయంతో ఎంక్యూ-9బీ డ్రోన్లు, సంబంధిత పరికరాలను భారత్‌కు విక్రయించేందుకు ఆమోదం తెలుపుతూ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది’’ అని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది.  ‘‘ఎంక్యూ-9బీ డ్రోన్ల విక్రయం అనేది అమెరికా- భారత్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇండో-పసిఫిక్‌, దక్షిణాసియాలో మా ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపర్చడానికి సాయం చేస్తుంది’’ అని అమెరికా ఏజెన్సీ తెలిపింది. భారత్‌కు అగ్రరాజ్యం విక్రయించనున్న 31  ఎంక్యూ-9బీ డ్రోన్లలో  15 ‘సీగార్డియన్ రకం డ్రోన్లు’ ఉంటాయి. వీటిని నౌకాదళానికి కేటాయిస్తారు. మిగిలిన 16 ‘స్కైగార్డియన్‌ రకం డ్రోన్ల’ను  ఆర్మీ, వాయుసేనకు ఎనిమిది చొప్పున అప్పగిస్తారు.

We’re now on WhatsApp. Click to Join

అమెరికాకే చుక్కలు చూపించిన సూసైడ్ డ్రోన్!

ఇటీవల(జనవరి 28న) జోర్డాన్‌ ఈశాన్య ప్రాంతంలో ఉన్న అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరం టవర్‌ 22పై మిలిటెంట్‌ గ్రూప్‌ జరిపిన డ్రోన్‌ దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉండే అమెరికా డ్రోన్ దాడిని అడ్డుకోకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై దర్యాపు చేసిన‌ అమెరికా సైనిక అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. మిలిటెంట్‌ దళాలు డ్రోన్‌ దాడులు చేసిన సమయంలో అమెరికాకు సంబంధించిన ఒక డ్రోన్‌ ఆర్మీ పోస్ట్‌కు వస్తుందని సైనిక శిబిరం భావించింది. తక్కువ ఎత్తులో సైనిక స్థావరం వైపు దూసుకొచ్చిన డ్రోన్‌ను అ‍ప్పటికే షెడ్యూల్‌ చేసిన తమ డ్రోన్‌గా భావించించారు సైనిక అధికారులు. తమ స్థావరం వైపు వస్తున్న డ్రోన్‌ తమదే అనుకొని పొరపాటు పడ్డారు. దానివల్లే మిలిటెంట్ల డ్రోన్‌ దాడిని తాము అడ్డుకోలేకపోయామని సైనిక అధికారులు పేర్కొన్నారు. మిలిటెంట్లు ప్రయోగించిన సూసైడ్ డ్రోన్‌ సైనిక శిబిరంపై పడినట్లు పేర్కొంది. ఈ దాడిలో ముగ్గురు సైనికులు మరణించగా.. 40 మంది సైనికులు  గాయపడ్డారు. ఇక్కడ సుమారు 350 మంది అమెరికా సైనికులు పని చేస్తున్నారు.

Also Read :Pakistan Election: పాకిస్థాన్‌లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి: అమెరికా


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 4 Billion dollars
  • india
  • MQ-9B
  • us

Related News

America

America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

వాషింగ్టన్ న్యూఢిల్లీపై 50 శాతం భారీ టారిఫ్‌ను విధించిన సమయంలోనే భారత అధికారులు అమెరికాలో పర్యటించడం గమనార్హం. పెనాల్టీ ఉన్నప్పటికీ భారతదేశం ఇప్పటికీ రష్యా నుండి చౌక చమురు కొనుగోలును కొనసాగిస్తోంది.

  • IND vs SL

    IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

  • Og Collections Us

    OG Box Office : ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న OG ..ప్రీమియర్లతోనే సరికొత్త రికార్డు

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

  • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd