Kharge: మోదీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: ఖర్గే
- By Balu J Published Date - 10:01 PM, Thu - 8 February 24
Kharge: ‘‘మోదీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని, గత పదేళ్లలో వేరే పార్టీలకు చెందిన 411 మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కుప్ప కూల్చారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు మల్లికార్జున్ ఖర్గే.
రాష్ట్రపతి హోదాలో ఓ గిరిజన మహిళను కూర్చోబెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ…ద్రవ్యోల్బణం గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ మత కల్లోలాలు సృష్టించారంటూ ఆరోపించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందేంటి..? అని ప్రశ్నించారు. విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టారని మండి పడ్డారు.”మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందేంటి..? దేశాన్ని ముక్కలు చేయాలంటూ విద్వేషపూరిత ప్రసంగాలిచ్చారు. ఈ మేరకు పదేళ్ల మోదీ సర్కార్ పాలనపై Black Paper విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం White Paper కి కౌంటర్గా దీన్ని రూపొందించారు. ఈ బ్లాక్ పేపర్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలన్నీ ప్రస్తావించినట్టు ఖర్గే వెల్లడించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలతో పాటు ఆర్థిక వ్యవస్థలోని లోపాలనూ ఎత్తి చూపినట్టు స్పష్టం చేశారు. దస్ సాల్ అన్యాయ్ కాల్ పేరిట ఈ బ్లాక్ పేపర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఖర్గే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని విమర్శించారు.
Tags
Related News
Bomb threat in Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపులు.. మోదీ, ముఖేష్ అంబానీలకు 400 కోట్ల డిమాండ్
ఢిల్లీ ఎన్సీఆర్లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దేశ రాజధాని వ్యాప్తంగా మొత్తం 100కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఢిల్లీలోని సుమారు 100 స్కూళ్లను తాత్కాలికంగా మూసేశారు.