HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Terrorists Attack Army Post In Kashmirs Doda

Terrorists Attack : కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడి.. ఆర్మీ బేస్‌పై కాల్పులు.. ఒకరు మృతి

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకలు మరోసారి పేట్రేగారు.

  • By Pasha Published Date - 08:16 AM, Wed - 12 June 24
  • daily-hunt
Terrorists Attack
Terrorists Attack

Terrorists Attack : జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకలు మరోసారి పేట్రేగారు. దోడా జిల్లాలోని ఛాతర్‌గలా ప్రాంతంలో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన  తాత్కాలిక చెక్‌ పాయింట్‌పై  మంగళవారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇక భద్రతా బలగాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా, ఓ పౌరుడు గాయపడ్డాడు. ఈ దాడికి సంబంధించిన వివరాలను జమ్మూకశ్మీర్ ఏడీజీపీ ఆనంద్ జైన్ మీడియాకు వెల్లడించారు. కతువా జిల్లాలోని సైదా సుఖుల్ గ్రామంపై సోమవారం సాయంత్రం దాడి చేసిన ఉగ్రవాదుల జాడ కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ జరుపుతుండగా ఈ దాడి జరిగిందన్నారు.  ప్రస్తుతం ఎన్‌కౌంటర్ జరుగుతోందని, ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేత కోసం అదనపు బలగాలు ఛాతర్‌గలా ప్రాంతానికి చేరుకున్నట్టు ఆనంద్ జైన్ చెప్పారు. గత మూడు రోజుల వ్యవధిలో కశ్మీర్‌లో జరిగిన మూడో ఉగ్రదాడి(Terrorists Attack) ఇది. ఇంతకుముందు రియాసి , కథువాలలో ఇదే తరహాలో ఉగ్రదాడులు జరిగాయి.

We’re now on WhatsApp. Click to Join

ఆదివారం సాయంత్రం కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై రియాసీ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో బస్సు లోయలో పడిపోయింది. దీంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. లోయలో పడిపోయిన బస్సుపై అరగంట పాటు కొండపై నుంచి ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనకు పాల్పడిన కొద్ది గంటల్లో సోమవారం రోజు కథువాలోని హీరానగర్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపాన ఉన్న సైదా సుఖుల్ గ్రామంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు పౌరులు గాయపడ్డారు. సైన్యం ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడు పాకిస్తాన్‌కు చెందినవాడని గుర్తించారు.

Also Read :Chandrababu First Signature : చంద్రబాబు మొదటి సంతకం ఆ ఫైల్ పైనేనా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Army Post
  • Doda
  • Jammu and Kashmir
  • kashmir
  • Reasi
  • Terrorists Attack

Related News

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd