Article 370 : జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మరోసారి ఉద్రిక్తత
Article 370 : బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్ సోదరుడు, అవామీ ఇత్తేహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ వెల్ వద్దకు దూసుకొచ్చి, ఆర్టికల్ పునరుద్ధరించాలని బ్యానర్ ప్రదర్శించారు. దాంతో బీజేపీ నేతలు జోక్యం చేసుకున్నారు.
- Author : Latha Suma
Date : 08-11-2024 - 12:34 IST
Published By : Hashtagu Telugu Desk
Jammu and Kashmir Assembly : జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఈరోజు (శుక్రవారం) కూడా ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై బీజేపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు, కమలం పార్టీ అవలంబిస్తోన్న భిన్నవైఖరి సభలో గందరగోళానికి కారణమైంది. దీంతో అరుపులు, తోపులాటలు, వాకౌట్లతో కార్యకలాపాలు స్తంభించాయి.
ఆర్టికల్ 370 ని పునరుద్దరించాలని ఇంజినీర్ రషీద్ సోదరుడు, అవామీ ఇతెహద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ గురువారం బ్యానర్ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటున్న ఖుర్షీద్ను ఇవాళ మార్షల్స్ బయటకు ఈడ్చుకెళ్లారు. బెంచ్ల మధ్య నినాదాలు చేస్తున్న ఖుర్షీద్ను అయిదారు మంది మార్షల్స్ బలవంతంగా లాక్కెళ్లారు. పీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇకపోతే..అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సునీల్ శర్మ(బీజేపీ) మాట్లాడుతుండగా.. బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్ సోదరుడు, అవామీ ఇత్తేహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ వెల్ వద్దకు దూసుకొచ్చి, ఆర్టికల్ పునరుద్ధరించాలని బ్యానర్ ప్రదర్శించారు. దాంతో బీజేపీ నేతలు జోక్యం చేసుకున్నారు. ఆ బ్యానర్ను లాగి, చించివేయడంతో అది కాస్తా తీవ్ర గందరగోళానికి కారణమైంది. ఖుర్షీద్తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు పంపివేశారు. తమ నేతలను మార్షల్స్తో బయటకు పంపించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ వాకౌట్ చేసింది. ఈ పరిణామాల మధ్య సభ 15 నిమిషాలు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా సభలో నిరసనలు కొనసాగాయి.
కాగా, సభాకార్యక్రమాలు తిరిగి ప్రారంభమైనప్పుడు, ఆర్డర్ కోసం స్పీకర్ చేసిన విజ్ఞప్తిని ధిక్కరిస్తూ బీజేపీ సభ్యులు తమ నిరసనలను కొనసాగించారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ గౌరవార్థం బీజేపీ సభ్యులు నినాదాలు చేస్తుండగా, జమ్మూ మరియు కాశ్మీర్ స్వయంప్రతిపత్తి కోసం చేసిన చారిత్రాత్మక త్యాగాల గురించి ఎన్సి సభ్యులు నినాదాలతో ఎదురుదాడి చేయడంతో “నేను తీసుకోకూడదనుకునే చర్యలకు నన్ను బలవంతం చేయవద్దు” అని హెచ్చరించారు. .
నిరసన తెలుపుతున్న పలువురు బీజేపీ సభ్యులను తొలగించాలని స్పీకర్ ఆదేశించడంతో ఉద్రిక్తతలు మరింత తారాస్థాయికి చేరాయి. ఇది అసెంబ్లీ మార్షల్స్తో హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. చివరకు, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుండి బయటకు పంపించారు. ఈ చర్య ట్రెజరీ బెంచీలపై సభ్యుల నుండి చప్పట్లు కొట్టింది. మంత్రి సతీష్ శర్మ బీజేపీకి వ్యతిరేకంగా పదునైన వైఖరిని తీసుకున్నారు. వారి చర్యలను విభజన అని ఖండిస్తూ.. వారి నిరసన సమయంలో రాజ్యాంగంపై నిలబడి రాజ్యాంగాన్ని బలహీనపరిచారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన శాసనసభ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు.