New Year : నైట్ కర్ఫ్యూ విధిస్తున్న రాష్ట్రాలు ఇవే.. ?
భారతదేశంలో కరోనా వైరస్ కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నందున అనేక రాష్ట్రాలు మళ్లీ నైట్ కర్ఫ్యూ విధించాయి. ఆదివారం మహారాష్ట్ర లో 31 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేరళలో మరో 19 కేసులు నమోదయ్యాయి.
- By Hashtag U Published Date - 11:00 AM, Mon - 27 December 21
భారతదేశంలో కరోనా వైరస్ కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నందున అనేక రాష్ట్రాలు మళ్లీ నైట్ కర్ఫ్యూ విధించాయి. ఆదివారం మహారాష్ట్ర లో 31 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేరళలో మరో 19 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ లో మూడు, చండీగఢ్ లో రెండు, హర్యానాలో ఒకటి ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అలాగే మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ల్లో మొదటిసారిగా ఓమిక్రాన్ కేసులను నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 141 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూని విధించాయి. ఢిల్లీలో ఆదివారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటలవరకు రాత్రి కర్ఫ్యూ విధించారు. ఇది 27వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఢిల్లీలో 290 తాజా కరోనావైరస్ కేసులు, ఒక మరణం నమోదైంది, అయితే పాజిటివిటీ రేటు 55 శాతానికి పెరిగింది. దేశ రాజధానిలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటు కర్ణాటక సర్కార్ కూడా డిసెంబర్ 28 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన జరిగిన సీనియర్ మంత్రులు, అధికారుల ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరు 28 నుంచి దాదాపు పది రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించి, రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు సెక్షన్ 144ను అమలు చేస్తూ చూడాలనుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె సుధాకర్ తెలిపారు.
అస్సాంలోని హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 11.30 నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను ప్రకటించింది. అయితే ఈ రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసు ఒక్కటి కూడా నమోదవ్వలేదు కానీ ముందస్తు జాగ్రత్తగా కర్ష్యూని విధించింది. ఉత్తరప్రదేశ్ లో డిసెంబర్ 25 నుండి రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. అలాగే వివాహాలకు అనుమతించే వ్యక్తుల సంఖ్యను 200కి పరిమితం చేశారు. కోవిడ్ ప్రోటోకాల్లను అన్ని సమయాలలో అనుసరించాల్సి ఉంటుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.ఇటు హర్యానా ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు ప్రజల రాకపోకలను పరిమితం చేసింది. బహిరంగ ప్రదేశాలు, కార్యక్రమాలలో 200 మందికి పైగా గుమిగూడడాన్ని కూడా నిషేధించింది. ఇది డిసెంబర్ 25 నుండి జనవరి 5, 2022 వరకు అమల్లో ఉంటుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని చౌహాన్ తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం డిసెంబర్ 25 నుండి ఎనిమిది నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ వ్యవధిని రెండు గంటలు పొడిగించింది. కర్ఫ్యూ ఉదయం 1 నుండి ఉదయం 5 గంటల వరకు కాకుండా రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. కొత్త సమయం అహ్మదాబాద్, సూరత్, రాజ్కోట్, వడోదర, జునాగఢ్, జామ్నగర్, భావ్నగర్ మరియు గాంధీనగర్ నగరాల్లో అమలు చేయబడుతుంది.
కరోనాతో అత్యధికంగా దెబ్బతిన్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రి 9 నుండి ఉదయం 6 గంటల మధ్య ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధిస్తూ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించింది. జిమ్లు, స్పాలు, హోటళ్లు, థియేటర్లు, సినిమా హాళ్లకు 50% సామర్థ్యం అనుమతించబడుతుంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Related News
New COVID Variant: కరోనా నుంచి మరో కొత్త రకం.. భారత్లో పెరుగుతున్న ఆందోళన
భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తోంది.