Drug Cases to NCB: ఎన్ సీబీకి ‘డ్రగ్స్’ చిట్టా.. దోషులు దొరికేనా!
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడా చూసినా డ్రగ్స్ కేసులే వెలుగులు చూస్తున్నాయి. చాపకింద నీరులా దేశంలో అన్ని రాష్ట్రాల్లో భారీస్థాయిలో డ్రగ్స్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే రాష్ట్రాలు డ్రగ్స్ ను అరికట్టడంలో సఫలంకాకపోతున్నాయి.
- By Balu J Published Date - 04:01 PM, Thu - 17 February 22
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడా చూసినా డ్రగ్స్ కేసులే వెలుగులు చూస్తున్నాయి. చాపకింద నీరులా దేశంలో అన్ని రాష్ట్రాల్లో భారీస్థాయిలో డ్రగ్స్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే రాష్ట్రాలు డ్రగ్స్ ను అరికట్టడంలో సఫలంకాకపోతున్నాయి. డ్రగ్స్ ను అడ్డుకట్ట వేసేందుకే ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలి? అనే విషయాలపై అవగాహన లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ సీబీకి (యాంటీ నార్కోటిక్స్ ఏజెన్సీ)కి అప్పగించాయి. ఈ మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్సిబికి 25 “పెద్ద” డ్రగ్స్ కేసులను అప్పగించాయి. తద్వారా సమగ్ర దర్యాప్తు నిర్వహించి డ్రగ్స్ ములాలను వెలికితీసే అవకాశం ఉందని అధికారులు గురువారం తెలిపారు. ఫెడరల్ యాంటీ నార్కోటిక్స్ ఏజెన్సీ ఈ కేసుల దర్యాప్తును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించింది. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు, నిందితులను పట్టుకోవడం, ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం లాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు.
మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్రాలు డ్రగ్స్ కేసులను గుర్తించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి అప్పగించాయి. పెద్ద మొత్తంలో పరిష్కారం కాని డ్రగ్స్ కేసులను కేంద్ర ఏజెన్సీకి అప్పగించే చర్య, డ్రగ్స్ ములాలను ఎన్సిబి డైరెక్టర్ జనరల్ (డిజి) సత్య నారాయణ్ ప్రధాన్ గతేడాది నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు రాసిన లేఖలో పేర్కొంది. రాష్ట్రాలు కేసులు పంపడాన్ని పరిగణించాలని పేర్కొంది. విచారణను వేగవంతం చేసేందుకు హోంమంత్రి అమిత్ షా తో మీటింగ్ అయిన తర్వాత ఈ లేఖ రాశారు. “కేంద్ర, రాష్ట్ర మాదక ద్రవ్యాల నేరాల దర్యాప్తు సంస్థలు సున్నితమైన విషయాలపై పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా డిజి ప్రధాన్ స్పందిస్తూ.. రాష్ట్రాలు ఇప్పటి వరకు అలాంటి 25 కేసులను ఏజెన్సీకి అప్పగించాయని, వాటిపై ఏజెన్సీ పని ప్రారంభించిందని చెప్పారు.
“మేం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నాము. త్వరలో పెద్ద పెద్ద డ్రగ్స్ కేసులు 25 వరకు వస్తాయని మేం భావిస్తున్నాం. ఈ కేసులో మొదట పనిచేసిన రాష్ట్ర అధికారుల సహాయంతో డ్రగ్స్ సరఫరాను వెలికితీసి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డకట్ట వేస్తాం” అని ప్రధాన్ చెప్పారు. మాదక ద్రవ్యాలతో ముడిపడి వ్యవస్థీకృత నేరాలు, తీవ్రవాద సిండికేట్లు మాదకద్రవ్యాల వ్యసనం నుండి దేశ భవిష్యత్తు తరాలను రక్షించడమే కాకుండా, జాతీయ భద్రతకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో లేఖ అందింది. చాలా సందర్భాలలో వ్యాపారులు, ప్రముఖులు చట్టం నుండి తప్పించుకున్నారు. ఇది రాష్ట్రంతో సహా భారతదేశంలోని అన్ని మాదకద్రవ్యాల చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలకు తీవ్రమైన సవాలుగా నిలిచింది. దేశంలో మాదకద్రవ్యాల మహమ్మారికి వ్యతిరేకంగా దర్యాప్తు చేయడానికి ఇంటర్-ఏజెన్సీ సమన్వయం అవసరం” అని ప్రధాన్ రాశారు.
Related News
Varalaxmi Sarathkumar : డ్రగ్స్ కేసులో అరెస్ట్ ఫై స్పందించిన వరలక్ష్మి శరత్కుమార్..
డ్రగ్స్ కేసు (Drug Case)లో హనుమాన్ ఫేమ్ వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar Arrest) అరెస్ట్ అయ్యిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం అవుతుండడం తో దీనిపై వరలక్ష్మి స్పందించింది. అవన్నీ పుకార్లే అని..కొంతమంది వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రగ్స్ అనే మాట వినిపిస్తే ముందుగా చిత్రసీమ ఫై కన్నేస్తారు. ఎందుకంటే సినీ ప్రముఖులే డ్రగ్స్ ను ఎక్కువగా వాడుతుంటారని ఎప్పటినుండో ఓ ప