India – Pakistan War : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల భరతం పడుతున్న భద్రతా బలగాలు
India - Pakistan War : ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థల సహాయంతో ఉగ్రవాదుల దాగుడు మూతలు గుర్తించి దాడులు నిర్వహిస్తున్నారు
- Author : Sudheer
Date : 16-05-2025 - 11:48 IST
Published By : Hashtagu Telugu Desk
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఆపరేషన్లను (Operations against Terrorists) ముమ్మరం చేశాయి. గత రెండు రోజులలో జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. నిన్న జరిగిన ఓ గట్టికాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా సిబ్బంది హతమార్చారు. వరుసగా జరిగే ఈ ఆపరేషన్లతో ప్రాంతీయంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నప్పటికీ, భద్రతా వ్యవస్థ మరింత గట్టి పటిష్టంగా మారుతోంది.
Konda Surekha : వరుస వివాదాల్లో మంత్రి కొండా సురేఖ..!
ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థల సహాయంతో ఉగ్రవాదుల దాగుడు మూతలు గుర్తించి దాడులు నిర్వహిస్తున్నారు. ప్రతి చిన్న సమాచారం ఆధారంగా సైన్యం స్పెషల్ ఆపరేషన్లకు పాల్పడుతూ, ఉగ్రవాదుల ప్రభావాన్ని పూర్తిగా అణిచివేయడానికి కృషి చేస్తోంది.
ఇక కశ్మీర్ లో ఇంకా అనేక మంది ఉగ్రవాదులు దాగి ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల భద్రతా బలగాలు మరిన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఉగ్రవాదులు ప్రజలకు ప్రమాదం కలిగించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భద్రతా పరిరక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంశాఖ కూడా స్పష్టం చేసింది.