HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Rs 23 Thousand Crores Seized In Ed Investigation Solicitor General Reveals In Supreme Court

ED Recovered Money : ఈడీ దర్యాప్తులో రూ. 23 వేల కోట్లు స్వాధీనం..సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ వెల్లడి

ఇది మనీలాండరింగ్ కేసులపై ఈడీ చేపట్టిన దర్యాప్తు సీరియస్‌గా కొనసాగుతోందని స్పష్టం చేస్తోంది. ఈ వ్యాఖ్యలు భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ (బీపీఎస్‌ఎల్‌) అంశంలో జరిగిన సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వెలువడ్డాయి. గతంలో బీపీఎస్‌ఎల్‌ ఆస్తుల విక్రయానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

  • By Latha Suma Published Date - 03:32 PM, Thu - 7 August 25
  • daily-hunt
Rs. 23 thousand crores seized in ED investigation.. Solicitor General reveals in Supreme Court
Rs. 23 thousand crores seized in ED investigation.. Solicitor General reveals in Supreme Court

ED Recovered Money : దేశవ్యాప్తంగా మనీలాండరింగ్‌ కేసులపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇప్పటివరకు దాదాపు రూ. 23 వేల కోట్ల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకుని, ఆ మొత్తాన్ని ఆర్థిక నేరాల బారిన పడిన బాధితులకు చెల్లించినట్లు సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు వెల్లడించారు. ఇది మనీలాండరింగ్ కేసులపై ఈడీ చేపట్టిన దర్యాప్తు సీరియస్‌గా కొనసాగుతోందని స్పష్టం చేస్తోంది. ఈ వ్యాఖ్యలు భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ (బీపీఎస్‌ఎల్‌) అంశంలో జరిగిన సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వెలువడ్డాయి. గతంలో బీపీఎస్‌ఎల్‌ ఆస్తుల విక్రయానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తీర్పును పునఃపరిశీలించాలని పలువురు అభ్యర్థించిన నేపథ్యంలో, ఈ విషయంపై విచారణ చేపట్టింది.

Read Also: National Handloom Day : చేనేతలు భారతీయ సంప్రదాయానికి ప్రతిబింబం : సీఎం చంద్రబాబు

విచారణ సందర్భంగా ఓ న్యాయవాది మాట్లాడుతూ బీపీఎస్‌ఎల్‌ కంపెనీపై ఈడీ కేసు కూడా ఉన్నదని ప్రస్తావించారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పందిస్తూ ..‘‘ఇక్కడ కూడా ఈడీ ఉందా?’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూనే… ఇక్కడ ఒక సత్యాన్ని చెబుతాను. ఇప్పటివరకు మేము ఈ విషయాన్ని ఏ కోర్టులోనూ స్పష్టంగా ప్రస్తావించలేదు. ఈడీ తన దర్యాప్తులో భాగంగా రూ. 23 వేల కోట్లను స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం ప్రభుత్వ ఖజానాలోకి కాకుండా బాధితులకు తిరిగి చెల్లించింది. అంటే ఆర్థిక నష్టాలు ఎదుర్కొన్న వారికి ఈడీ సహాయంగా నిలిచింది అని వివరించారు.

అయితే, కేసుల పరంగా శిక్షల వివరాలపై సుప్రీంకోర్టు ఆసక్తి చూపింది. ఈ కేసుల్లో ఎంతమంది నేరస్తులకు శిక్షలు ఖరారయ్యాయి? అని ప్రశ్నించగా, తుషార్‌ మెహతా శిక్షలు పడిన సందర్భాలు తక్కువే అని తెలిపారు. దీనికి స్పందించిన ధర్మాసనం తప్పుడు నిర్ధారణ కాకపోయినా, విచారణ పేరిట వారికి మీరు సంవత్సరాలపాటు శిక్ష విధించినట్టే. ఇది మేం గమనించాలి అని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థలో ఈడీ పాత్రపై చర్చకు దారితీశాయి. విచారణ పేరుతో వ్యక్తులపై సంవత్సరాల పాటు చర్యలు తీసుకుంటే, వారి హక్కులు ఎలా రక్షించబడతాయన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు, కోర్టు పర్యవేక్షణలో కేసుల వేగవంతమైన పరిష్కారానికి పిలుపునిచ్చారు. మనీలాండరింగ్‌ వంటి ఆర్థిక నేరాలపై పోరాటం అవసరమే అయినా, న్యాయప్రక్రియల్లో పారదర్శకత, వేగం కీలకమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read Also: BRS BC Meeting Postponed: బీఆర్ఎస్ బీసీ గర్జన సభ వాయిదా

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BPSL
  • ED Recovered Money
  • Money Laundering Cases
  • Solicitor General Tushar Mehta
  • Supreme Court

Related News

Four years of locality mandatory for medical students: Supreme Court

Telangana : వైద్య విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి: సుప్రీంకోర్టు

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి మరియు డివిజన్ బెంచ్ ఇచ్చిన పూర్వపు ఉత్తర్వులను పక్కన పెట్టింది. దీంతో, స్థానికత నిబంధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన మద్దతు లభించింది.

  • E20 Fuel Policy

    E20 Fuel Policy: సుప్రీంకోర్టుకు చేరిన E20 ఇంధన విధానం.. అస‌లు ఈ20 ఇంధ‌నం అంటే ఏమిటి?

Latest News

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

  • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

  • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd