News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄India News
  • ⁄Rohini Commission A Big Step Towards Empowering Obcs

Rohini Commission: బీసీ వ‌ర్గీక‌ర‌ణ‌పై జ‌స్టిస్ రోహిణి సంచ‌ల‌న నివేదిక‌

వెనుక‌బ‌డిన కులాల‌ను నాలుగు కేట‌రిగిరీలుగా వ‌ర్గీక‌రిస్తూ జ‌స్టిస్ రోహిణి క‌మిష‌న్ సంచ‌ల‌న సిఫార‌స్సుల‌ను చేసింది.

  • By CS Rao Published Date - 06:00 PM, Sat - 30 April 22
Rohini Commission:  బీసీ వ‌ర్గీక‌ర‌ణ‌పై జ‌స్టిస్ రోహిణి సంచ‌ల‌న నివేదిక‌

వెనుక‌బ‌డిన కులాల‌ను నాలుగు కేట‌రిగిరీలుగా వ‌ర్గీక‌రిస్తూ జ‌స్టిస్ రోహిణి క‌మిష‌న్ సంచ‌ల‌న సిఫార‌స్సుల‌ను చేసింది. వేలాదిగా ఉన్న ఓబీసీలంద‌రికీ న్యాయం జర‌గాలంటే వ‌ర్గీక‌ర‌ణ అవ‌స‌ర‌మ‌ని క‌మిష‌న్ తేల్చింది. భారత్ లో 2,633 ఓబీసీ కులాలు ఉన్నాయ‌ని లెక్కించింది. ఆ కులాల‌ను ఓబీసీ 1, ఓబీసీ 2, ఓబీసీ 3, ఓబీసీ 4 కేటగిరీలుగా విభజించాలని కమిషన్ సూచించింది.

వెనుక‌బ‌డిన వ‌ర్గాల్లోని ఉప కులాల పరిశీలన కోసం 2017లో జస్టిస్ జి.రోహిణి కమిషన్ ను కేంద్రం నియ‌మించింది. ఆ మేర‌కు అధ్యయనం చేసిన రోహిణి కమిషన్ తుది నివేదికను శ‌నివారం కేంద్రానికి అంద‌చేసింది. కేటగిరి 1కు అత్యధికంగా 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సిఫార‌స్సు చేసింది.

వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు విద్య‌, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ల క‌ల్పించాల‌నే రాజ‌కీయ ప‌క్షాల‌తో స‌మావేశాల‌ను నిర్వ‌హించింది. ఆ త‌రువాత రోహిణి క‌మిష‌న్ ను అధ్య‌య‌నం కోసం నియ‌మించ‌గా ఉప కులాల్లో వర్గీకరణ అవ‌స‌ర‌మ‌ని తేల్చింది. వేల సంఖ్యలో ఉన్న ఓబీసీ కులాల మధ్య 27 శాతం రిజర్వేషన్ కోసం తీవ్ర‌మైన‌ పోటీ ఉండ‌డాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వ‌ర్గీక‌ర‌ణ ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌చేసింది.

తాజాగా జ‌స్టిస్ రోహిణి క‌మిష‌న్ ఇచ్చిన వ‌ర్గీక‌రణ నివేదిక‌పై కేంద్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని భావిస్తోంది. నివేదిక‌పై వివిధ రాజ‌కీయ ప‌క్షాల‌తో చ‌ర్చించాల‌ని యోచిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీ కులాల రిజర్వేషన్ల అంశం రాజ‌కీయ పార్టీల‌పై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. మండ‌ల్ క‌మిష‌న్ ఆనాడు దేశ వ్యాప్తం ఎలాంటి చిచ్చు రేపిందో మ‌న‌కు తెలిసిందే. ప్ర‌స్తుతం ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ. కూడా కేంద్రం వ‌ద్ద పెండింగ్ లో ఉంది. దానిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుండా ఇప్పుడు జ‌స్టిస్ రోహిణి క‌మిష‌న్ ఇచ్చిన సిఫార‌స్సుల మేర‌కు బీసీ వ‌ర్గీక‌ర‌ణ చేస్తే దేశ వ్యాప్తంగా గంద‌ర‌గోళం నెల‌కొనే ప‌రిస్థితి ఉంది.

Tags  

  • obc categories
  • rohini comission

Related News

Population Census: జ‌నాభా లెక్కల‌కు చిక్కులు త‌ప్పవా? సామాజికవర్గాల లెక్కలపై చిక్కులెందుకు?

Population Census: జ‌నాభా లెక్కల‌కు చిక్కులు త‌ప్పవా? సామాజికవర్గాల లెక్కలపై చిక్కులెందుకు?

దేశంలో జ‌నాభా లెక్కల సేక‌ర‌ణకు ఈ సారి ఇబ్బందులు ఎదురయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ప్రతి ప‌దేళ్లకు ఒక సారి జ‌నాభా వివ‌రాల‌ను న‌మోదు చేస్తుంటారు.

    Latest News

    • Bengaluru Rains : వైప‌రిత్యాల నివార‌ణ‌కు మంత్రుల‌తో టాస్క్ ఫోర్స్

    • Rs 1 Lakh Umbrella: అదిదాస్, గుక్సీ.. గొడుగు కాని గొడుగు @ 1 లక్ష

    • Humanity Video: మానవత్వం పరిమళించే.. పిచుకమ్మ గొంతు తడిచే

    • RBI New Rules : ఇక కార్డ్ లేకుండా ఏటీఎంల‌లో డ‌బ్బు విత్ డ్రా

    • NTR Penned: నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను!

    Trending

      • Air India : `ఎయిర్ ఇండియా విమానం` టేకాఫ్ గంద‌ర‌గోళం

      • Canadian MP in Kannada: కెనడా పార్లమెంట్ లో కన్నడం…ఉపన్యాసం దంచికొట్టిన ఎంపీ..వీడియో వైరల్..!!

      • Ram Charan on NTR B’day: నువ్వు నాకేంటో చెప్పేందుకు నా దగ్గర పదాలు లేవు…రాంచరణ్ ఎమోషనల్ ట్వీట్..!!

      • Thalapathy Vijay: విజయ్ వచ్చింది కేసీఆర్ కోసం కాదా? పీకేను కలవడానికా?

      • 206 Kidney Stones: కిడ్నీలో 206 రాళ్లు…తొలగించిన వైద్యులు..!!

    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    • Copyright © 2022 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam
    • Follow us on: