Nitish – Tejashwi : ఒకే విమానంలో ఢిల్లీకి తేజస్వి, నితీశ్.. ఏం జరగబోతోంది ?
ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతోంది ? నితీశ్ కుమార్.. ఏం చేయబోతున్నారు ?
- By Pasha Published Date - 10:33 AM, Wed - 5 June 24
![Nitish – Tejashwi : ఒకే విమానంలో ఢిల్లీకి తేజస్వి, నితీశ్.. ఏం జరగబోతోంది ?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Nitish-Tejashwi.jpg)
Nitish – Tejashwi : ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతోంది ? నితీశ్ కుమార్.. ఏం చేయబోతున్నారు ? ఆయన హాజరయ్యేది ఇండియా కూటమి మీటింగ్కా ? ఎన్డీయే కూటమి సమావేశానికా ? అనేది కాసేపట్లో తేలిపోనుంది. ఇంత ఉత్కంఠ ఎందుకంటే.. ఇవాళ ఒకే విమానంలో జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(Nitish – Tejashwi) ఒకే విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇండియా, ఎన్డీయే కూటములు పోటాపోటీ సమావేశాలను ఇవాళ నిర్వహిస్తున్న వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
We’re now on WhatsApp. Click to Join
- ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి 291 లోక్సభ సీట్లు వచ్చాయి.
- కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి 235 సీట్లు వచ్చాయి.
- కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఇండియా కూటమికి మరో 37సీట్లు కావాలి.
- దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇండియా కూటమి కూడా ప్రయత్నాలు చేస్తోంది.
- ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో ఉన్న పాత దోస్తులతో రహస్య మంతనాలు జరుపుతోంది.
- ఈక్రమంలోనే ఇవాళ ఇండియా, ఎన్డీయే కూటములు ఢిల్లీ వేదికగా తమ మిత్రపక్షాలతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
Also Read :Instagram Ads : యూట్యూబ్ బాటలో ఇన్స్టా.. యూజర్ల ఓపికకు పరీక్ష
- ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరు కావాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోడీ నుంచి ఆహ్వానం అందింది.
- ఈ ఎన్నికల్లో టీడీపీ 15, జేడీయూ 12 సీట్లు గెలుచుకున్నాయి.
- టీడీపీ, జేడీయూతో ఇండియా కూటమి దిగ్గజ నేత శరద్ పవార్ మంతనాలు జరిపారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
- ఇవాళ ఇండియా కూటమి సమావేశం తర్వాతే తదుపరి వ్యూహాన్ని ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం సాయంత్రం తెలిపారు.
- దీంతో ఇండియా కూటమి ఏం చేయబోతోంది ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : Heavy Rains: నేడు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..!
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Maharashtra Rains: మహారాష్ట్రలో వర్ష భీభత్సం, లోకల్ రైలు సేవలు నిలిపివేత](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/tj.jpg)
Maharashtra Rains: మహారాష్ట్రలో వర్ష భీభత్సం, లోకల్ రైలు సేవలు నిలిపివేత
మహారాష్ట్ర లోకల్ రైలు సర్వీసులపై కూడా వర్షం ప్రభావం పడింది. ముంబైకి ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కసారా మరియు టిట్వాలా స్టేషన్ల మధ్య భారీ వర్షం మరియు చెట్లు నేలకూలడంతో లోకల్ రైలు సర్వీసులను నిలిపివేశారు