RBI Hikes Repo: EMIలు మరింత భారం.. 4వ సారి రెపోరేటు పెంచిన ఆర్బీఐ
ఊహించినట్లుగానే రెపోరేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది.
- By hashtagu Published Date - 11:56 AM, Fri - 30 September 22
ఊహించినట్లుగానే రెపోరేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.9 శాతానికి చేర్చినట్లు ప్రకటించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమ వర్గాలు అంచనా వేసినట్లు కాకుండా ఆర్బీఐ మరింత అధికంగా పెంచేసింది. కొవిడ్ సంక్షోభం తర్వాత ఆర్బీఐ వరుసగా 4వ సారి రెపోరేటును పెంచింది.
భారాన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు వెంటనే బదలాయించనున్నాయి. ఈ మార్పును ముందే అంచనా వేసిన కొన్ని బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించేశాయి. దీంతో గృహ, కారు లోన్ సహా ఇతర రుణాల EMIలు మరింత భారం కానున్నాయి. ముందే చెప్పినట్లు ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకే రెపోరేటు పెంచుతున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో 5.4 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగింది. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీలను రెపోరేటుగా పిలుస్తారు. రెపోరేటు పెంచడం అంటే ఇక కమర్షియల్ బ్యాంకులు, లేదా వ్యక్తులకు రుణాలు తీసుకోవడం భారంగా మారుతుంది.
Tags
Related News
Heart Diseases: కరోనా తర్వాత పెరిగిన గుండెపోటు కేసులు.. అసలు కారణం ఇదేనట
Heart Diseases: కరోనా వైరస్తో బాధపడుతున్న వ్యక్తులు ఇప్పుడు కొత్త భయాన్ని ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి, కరోనా వైరస్ చూసిన చాలా మంది గుండెపోటు ప్రమాదాన్ని చూస్తున్నారు పెరుగుతున్న గుండెపోటు కేసులకు కరోనా మహమ్మారి కారణమని చెబుతున్న గణాంకాలు చెబుతున్నాయి.. ఎంత వరకు నిజమంటే 30 ఏళ్లలోపు వారిలో కూడా గుండెపోటు కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. అంతే కాకుండా బడి పిల్లలు కూడా దీని నుం