Rahul Gandhi: అమేథీ బరిలో రాహుల్ గాంధీ?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ, కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేశారు.
- By Praveen Aluthuru Published Date - 08:45 PM, Sat - 19 August 23
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ, కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేశారు. అయితే అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. కేరళలోని వాయనాడ్ లో గెలిచి లోక్ సభకు ఎన్నికయ్యారు. కాగా 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్గాంధీ అమేథీ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ చీఫ్ అజయ్ రాయ్ అన్నారు.
నిజానికి అమేథీ కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. 2004, 2009, 2014లో ఆయన గెలుపొందిన ఈ స్థానాన్ని కాంగ్రెస్ కంచుకోటగా భావించారు. 1999లో సోనియా గాంధీ అమేథీ నుంచి గెలుపొందారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఈ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
2024లో రాయ్బరేలీ స్థానం నుంచి సోనియా గాంధీని కాంగ్రెస్ మళ్లీ పోటీకి దింపుతుందా లేక పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను అభ్యర్థిగా పరిగణిస్తారా అనే ప్రశ్నకు రాయ్ సమాధానం ఆసక్తిగా ఉంది. ఈ ప్రశ్నకు పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. అయితే రాయ్బరేలీలో కాంగ్రెస్ విజయం సాధించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిఒక్కరు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.
Also Read: YSRTP : షర్మిల మనసు మార్చుకుందా..? కాంగ్రెస్ లో YSRTP ని విలీనం చేయడం లేదా..?
Related News
Annie Raja : రాహుల్ గాంధీ వాయనాడ్ ప్రజలకు చెబితే బాగుండేది
రాహుల్ గాంధీ రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో, వయనాడ్ లోక్సభ నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థి, సీపీఐకి చెందిన అన్నీ రాజా గురువారం ఆయనపై విమర్శలు గుప్పించారు.