Rahul Gandhi : రాహుల్ గాంధీకి అస్వస్థత.. ‘ఇండియా’ ర్యాలీకి గైర్హాజరు
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు.
- By Pasha Published Date - 04:12 PM, Sun - 21 April 24
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన మధ్యప్రదేశ్లోని సాత్నాలో జరిగే ఇండియా కూటమి మెగా ర్యాలీకి గైర్హాజరయ్యారు. ఈవిషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటించారు. రాహుల్ అస్వస్థతకు గురికాడంతో ప్రస్తుతం ఢిల్లీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితిలో లేరని తెలిపారు. రాహుల్ గాంధీకి బదులుగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి ర్యాలీకి హాజరవుతారని తెలిపారు. తొలుతగా జార్ఖండ్లోని రాంచీలో కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధార్థ్ కుష్వాహా తరపున జరిగే ప్రచార సభలో ఖర్గే ప్రసంగిస్తారని, ఆ తర్వాత సాత్నాలో జరిగే సభకు ఖర్గే హాజరవుతారని జైరాం రమేష్ వెల్లడించారు.
श्री राहुल गांधी आज सतना और रांची में चुनाव प्रचार के लिए पूरी तरह से तैयार थे, जहां INDIA की रैली हो रही है। लेकिन वह अचानक बीमार हो गए हैं और फिलहाल नई दिल्ली से बाहर नहीं जा सकते हैं। कांग्रेस अध्यक्ष श्री मल्लिकार्जुन खरगे जी अवश्य सतना में जनसभा को संबोधित करने के बाद रांची…
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 21, 2024
We’re now on WhatsApp. Click to Join
ఇండియా కూటమి ఏప్రిల్ 21న సాత్నా వేదికగా “ఉల్గులన్ న్యాయ్ ర్యాలీ”ని నిర్వహించనున్నట్లు ఇంతకుముందు అనౌన్స్ చేసింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన సహా పలు మిత్రపక్షాల నాయకులు ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొననున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఈ ప్రతిష్ఠాత్మక ర్యాలీకి రాహుల్(Rahul Gandhi) హాజరు కాలేకపోతున్నారు. సాత్నాలోని ప్రభాత్ తారా గ్రౌండ్ లో జరిగే ఈ ర్యాలీలో మొత్తం 14 రాజకీయ పార్టీలు పాల్గొననున్నాయి.
Also Read :AP Elections 2024: బీజేపీ అభ్యర్దిగా టీడీపీ నేత..చంద్రబాబు వ్యూహం
Related News
KCR: కాంగ్రెస్ త్వరలో భూస్థాపితం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.ఈ రోజు శుక్రవారం పెద్దపల్లిలోని రామగుండంలో జరిగిన రోడ్షోలో పాల్గొన్న కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రకటించారు.