Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. పరువు నష్టం కేసులో బెయిల్!
రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.
- By Balu J Published Date - 05:45 PM, Mon - 3 April 23
పరువు నష్టం కేసులో జైలు శిక్షతో అనర్హత వేటు ఎదుర్కొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో రాహుల్ గాంధీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మోదీ ఇంటి పేరుకు సంబంధించి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రేండేళ్లు జైలు శిక్ష వేసిన విషయం తెలిసిందే. కాగా తనపై విధించిన శిక్షను రద్దు చేయాలనీ..రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ జరిపింది.
ఈ క్రమంలో రాహుల్ బెయిల్ ను ఈనెల 13 వరకు పొడిగిస్తూ సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది. బెయిల్ పొడిగింపుతో రాహుల్ కు ఊరట లభించింది. అలాగే తనని దోషిగా నిర్ధారిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని రాహుల్ కోరారు. అలాగే సెషన్స్ కోర్టు తీర్పు వెలువడే వరకు తనను దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. గాంధీ అభ్యర్థనను అంగీకరించిన కోర్టు ఏప్రిల్ 13న విచారణకు నిర్ణయించింది. అయితే, న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఏప్రిల్ 22 వరకు మరో గడువు విధించారు. ఎంపీ హోదాలో రాహుల్ గాంధీకి అధికారిక నివాసం కేటాయించారు.
Related News
Hybrid Pitch: భారతదేశపు మొదటి హైబ్రిడ్ పిచ్ సిద్ధం
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ధర్మశాలలో భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ పిచ్ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, మాజీ ఇంగ్లండ్ అంతర్జాతీయ క్రికెటర్ మరియు ఎస్ఐఎస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పాల్ టేలర్ మరియు హెచ్పిసిఎ అధికారుల సమక్షంలో ఎస్ఐఎస్ గ్రాస్ హైబ్రిడ్ పిచ్ను ఆవిష్కరించారు.