HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Prashant Kishor Says Nitish Kumar Brought Shame To Bihar When He Touched Pm Modis Feet

PK Vs Nitish : మోడీ కాళ్లు మొక్కి బిహార్ పరువు తీశారు.. సీఎం నితీశ్‌పై పీకే ఆగ్రహం

బిహార్ పాలిటిక్స్‌లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ యాక్టివ్ అయ్యారు.

  • By Pasha Published Date - 02:29 PM, Sat - 15 June 24
  • daily-hunt
Pk Vs Nitish
Pk Vs Nitish

PK Vs Nitish : బిహార్ పాలిటిక్స్‌లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ యాక్టివ్ అయ్యారు. ఆయనకు చెందిన జన్ సూరజ్ పార్టీ ముమ్మర కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకం అవుతోంది. వచ్చే ఏడాది అక్టోబరులో బిహార్‌లో జరిగే అసెంబ్లీ పోల్స్‌ను పీకే చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే తాజాగా  బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగిన జన్ సూరజ్ పార్టీ బహిరంగ సభలో  ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌పై పీకే ఫైర్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘నితీశ్ కుమార్ అధికార దాహంతో.. కేంద్ర మంత్రి పదవుల కోసం ప్రధాని మోడీ పాదాలకు నమస్కరించారు. ఇలా చేయడం ద్వారా ఆయన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టారు. సీఎం హోదాలో ఉండి..  బిహార్ పరువు తీసేలా నితీశ్ ప్రవర్తించారు’’ అని జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. ‘‘గతంలో నేను జేడీయూ పార్టీలో కీలక పదవిలో పనిచేశాను. నితీశ్ కుమార్‌తో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. అయినా ఇప్పుడు నేను ఆయన్ని విమర్శించాల్సి వస్తోంది. ఇలా ఎందుకు చేస్తున్నారని చాలామంది నన్ను అడుగుతున్నారు. అలాంటి వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే..  అప్పట్లో నితీశ్ వేరే వ్యక్తి.  ఆనాడు ఆయన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదు’’ అని పీకే కామెంట్ చేశారు. ‘‘నితీశ్ కుమార్ ఇప్పుడు తన సిద్దాంతాలతో రాజీ పడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల గురించే ఆయన ఆలోచిస్తున్నారు’’ అని ప్రశాంత్ కిశోర్(PK Vs Nitish) తెలిపారు.

Also Read : IAS Transfers : భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. 20 జిల్లాల కలెక్టర్ల మార్పు

‘‘ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు ఆ రాష్ట్రంలోని ప్రజలకు గర్వకారణంగా ఉండాలి. ఇతరుల పాదాలను తాకాల్సిన అవసరం లేదు. మోడీ పాదాలను తాకడం ద్వారా యావత్ బిహార్ రాష్ట్రాన్ని నితీశ్ అవమానించారు’’ అని పీకే చెప్పారు. ‘‘కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం నితీశ్ కీలక పాత్రలో ఉన్నా.. బిహార్ కోసం ఏమీ చేయలేకపోతున్నారు.  ఆయన తల్చుకుంటే చాలా చేయొచ్చు’’ అని ప్రశాంత్ కిశోర్ విమర్శించారు. కాగా, ఎన్డీయే కూటమి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ పాదాలను బిహార్ సీఎం నితీశ్ కుమార్ తాకి నమస్కరించారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ పై కామెంట్స్ చేశారు.

Also Read : Sesame Laddu : ఆడవాళ్లకు బలాన్నిచ్చే నువ్వుల లడ్డు.. తయారీ విధానం..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • nitish kumar
  • PK Vs Nitish
  • PM Modis Feet
  • prashant kishor

Related News

Bihar Election 2025

Bihar Elections : అక్టోబర్ తొలివారంలో బిహార్ ఎన్నికల షెడ్యూల్?

Bihar Elections : ఈ సమీకరణల్లో బిహార్ ఎన్నికలు కేవలం రాష్ట్ర రాజకీయాలను మాత్రమే కాకుండా 2029 సాధారణ ఎన్నికలకూ సంకేతాలు ఇవ్వగలవు. అందువల్ల, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, విశ్లేషకులు బిహార్ దిశగా ఆసక్తిగా గమనిస్తున్నారు.

    Latest News

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

    • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

    • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd