Rajasthan Political Crisis : రాజస్థాన్ కాంగ్రెస్లో పొలిటికల్ హైడ్రామా.. స్పీకర్కి రాజీనామాలు ఇచ్చేందుకు..?
రాజస్థాన్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ప్రస్తుతం సీఎంగా ఉన్న...
- By Prasad Published Date - 07:34 AM, Mon - 26 September 22
రాజస్థాన్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ప్రస్తుతం సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్లో మళ్లీ సంక్షోభం తలెత్తింది. రాజస్థాన్ లో తర్వాత సీఎం ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. అశోక్ గెహ్లాట్ సీఎంగా ఉండాలని చాలామంది ఎమ్మెల్యేలు కోరుతున్నారు. సచిన్ పైలట్ కు సీఎం పదవి అప్పగిస్తే 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. 92 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కాంగ్రెస్ బలం 55 కి పడిపోనుంది. బీజేపీకి 70 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు . సచిన్ పైలట్ సీఎం కాకుండా అశోక్ గెహ్లాట్ వర్గం అడ్డుకుంటోంది.
Related News
Raghunandan Rao : గల్లీలో.. ఢిల్లీలో లేని.. కారును గెలిపిస్తే మిగిలేది శూన్యమే: రఘునందన్ రావు
Raghunandan Rao:మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ జరిగిన కిసాన్ మోర్చా(kisan morcha) సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, రెవంత్రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని ఆయన అన్నారు. We’re now