PM New Scheme: మోడీ కొత్త పథకం ‘స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా’
దేశంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు.
- By Balu J Updated On - 11:49 AM, Tue - 6 September 22

దేశంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా -పీఎం- శ్రీ యోజన పేరిట వివరాలను ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ట్వీట్లలో వెల్లడించారు. దీని ప్రకారం, పీఎం- శ్రీ యోజన పేరిట దేశంలోని 14 వేల 500 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు.
ఈ పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలలు మోడల్ స్కూళ్లుగా మారతాయని, అత్యాధునిక సౌకర్యాలు ఎంపిక చేసిన ఈ స్కూళ్లకు కలిపిస్తామని ప్రధాని ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని మోదీ పేర్కొన్నారు.
Today, on #TeachersDay I am glad to announce a new initiative – the development and upgradation of 14,500 schools across India under the Pradhan Mantri Schools For Rising India (PM-SHRI) Yojana. These will become model schools which will encapsulate the full spirit of NEP.
— Narendra Modi (@narendramodi) September 5, 2022
Related News

Antarctica: అంటార్కిటికాలో ఎగిరిన పర్యావరణ స్ఫూర్తి పతాకం
ప్రకృతి, పర్యావరణం బాగుండాలి, మానవాళికి స్వచ్చమైన ప్రాణవాయువు అందాలి అనే సంకల్పంతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త శిఖరాలను చేరుకుంటోంది. దేశ విదేశాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా ఎగురుతోంది. పర్యావరణ మార్పులను ఎదుర్కోవాలి, ఆకు పచ్చని చెట్లను పెంచాలనే ప్రచారాన్ని విసృతంగా అన్ని వర్గాలకు చేరువ చేస్తోంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్.