Underwater Metro Train: విద్యార్థులతో కలిసి అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణించిన మోడీ
- By Latha Suma Published Date - 11:30 AM, Wed - 6 March 24
Underwater Metro Train: పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతా (Kolkata)లో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ప్రారంభించారు. హౌరా మైదాన్-ఎస్ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న నది కింద ఈ టన్నెల్ నిర్మించారు. కొత్త మెట్రో రూట్తో కోల్కతాలో రవాణా వ్యవస్థ సులభతరం కానున్నది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో (school students) కలిసి ప్రధాని మోడీ తొలిసారి ఈ మెట్రోలో ప్రయాణించారు. రూ.120 కోట్ల వ్యయంతో 16.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని ఇంజినీరింగ్ అద్భుతంగా పిలుస్తున్నారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ మార్గం కోల్కతాలోని రెండు జంట నగరాలైన హౌరా, సాల్ట్ లేక్లను కలుపుతుంది. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉండగా అందులో మూడు భూగర్భం (జలాంతర్గ)లో ఉన్నాయి.
#WATCH | West Bengal: Prime Minister Narendra Modi interacts with school students as they travel in India's first underwater metro train, in Kolkata. pic.twitter.com/lQye0OnuqP
— ANI (@ANI) March 6, 2024
read also : Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ కెరియర్ నాశనం అవడానికి గల కారణాలు ఇవే?
అండర్వాటర్ మెట్రోతో పాటు కవి సుభాష్- హేమంత ముఖోపాధ్యాయ మెట్రో స్టేషన్, తరతాలా-మజేర్హట్ మెట్రో సెక్షన్ను ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు. అదేవిధంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.
#WATCH | West Bengal: Prime Minister Narendra Modi interacts with metro staff as he travels in India's first underwater metro train along with state BJP president Sukanta Majumdar and WB LoP and BJP MLA Suvendu Adhikari, in Kolkata. pic.twitter.com/fmY7BZjBIu
— ANI (@ANI) March 6, 2024
Related News
KCR Bus Yatra: రేవంత్ ఛోటా భాయ్.. మోడీ బడే భాయ్: కేసీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటా భాయ్, నరేంద్ర మోడీ బడే భాయ్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. రేవంత్, మోడీ ఇద్దరూ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.