Modi with Advani: అద్వానీతో మోడీ.. బీజేపీ కురవృద్ధుడికి శుభాకాంక్షల వెల్లువ!
మంగళవారం బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ తన 95వ పుట్టినరోజును జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర రక్షణ మంత్రి
- By Balu J Published Date - 02:23 PM, Tue - 8 November 22
మంగళవారం బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ తన 95వ పుట్టినరోజును జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆయన నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా కలుసుకున్నారు. మోడీ పుష్ప గుచ్ఛం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నివాసంలో మోడీ కొద్దిసేపు గడిపారు కూడా. ఈ పర్యటన ఫోటోలను రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్లో పోస్ట్ చేసి, బీజేపీ అనుభవజ్ఞుడు “భారత రాజకీయాలలో అత్యున్నత వ్యక్తులలో ఒకరు” అని కొనియాడారు. దేశం, సమాజం, పార్టీ అభివృద్ధిలో ముఖ్యమైన ప్రాత వహించారని అన్నారు. పలువురు మంత్రులు, బీజేపీ అగ్రనేతలు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ తన నిరంతర కృషితో దేశవ్యాప్తంగా సంస్థను బలోపేతం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్లో పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం కూడా ట్వీట్ చేశారు. “నల్లధనానికి వ్యతిరేకంగా ఎల్కె అద్వానీ జీ చేపట్టిన జన్ చేతన యాత్ర ప్రభావాన్ని గుర్తు చేసుకోండి. ఈ నిబద్ధతను ముందుకు తీసుకువెళుతూ, పాలనలో పారదర్శకతను తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అనేక చర్యలు తీసుకున్నారు’’ అని అన్నారు. అద్వానీ నవంబర్ 8, 1927న కరాచీలో జన్మించారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయితో పాటు ఆయన బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు.
Went to Advani Ji’s residence and wished him on his birthday. His contribution to India’s growth is monumental. He is respected all across India for his vision and intellect. His role in building and strengthening the BJP is unparalleled. I pray for his long and healthy life. pic.twitter.com/Pdxy5Hko8d
— Narendra Modi (@narendramodi) November 8, 2022
Related News
KCR Bus Yatra: రేవంత్ ఛోటా భాయ్.. మోడీ బడే భాయ్: కేసీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటా భాయ్, నరేంద్ర మోడీ బడే భాయ్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. రేవంత్, మోడీ ఇద్దరూ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.