Sela Tunnel : సేలా టన్నెల్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- By Latha Suma Published Date - 12:27 PM, Sat - 9 March 24
Sela Tunnel : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సేలా టన్నెల్ (Sela Tunnel)ను శనివారం ప్రారంభించారు. ఇండియా – చైనా సరిహద్దులోని తూర్పు సెక్టార్లో నిర్మించిన ఈ టన్నెల్ ప్రపంచంలోనే అతి పొడవైనది (world’s longest bi-lane tunnel). బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రెండు వరుసలతో దీన్ని నిర్మించింది. ఈ టన్నెల్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. దీని ద్వారా మరింత వేగంగా సైనిక బలగాల రాకపోకలు సాగించవచ్చు.
#WATCH | Itanagar, Arunachal Pradesh: Prime Minister Narendra Modi inaugurates the Sela Tunnel. pic.twitter.com/hSeI30lhqk
— ANI (@ANI) March 9, 2024
We’re now on WhatsApp. Click to Join.
ఈ సేలా టన్నెల్ను సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. మొత్తం రూ.825 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ రెండు వరుసల టన్నెల్ మొత్తం పొడవు సుమారు 12 కిలోమీటర్లు. టన్నెల్ – 1 సింగిల్ ట్యూబ్తో 980 మీటర్ల పొడవు ఉంటుంది. టన్నెల్ -2 ట్విన్ ట్యూబులతో 1,555 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు 2019 ఫిబ్రవరి 9న ప్రధాని మోడీ శంకుస్థాపన చేయగా.. అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు.
read also : BJP Alliance TDP : టీడీపీ కూటమితో బిజెపి పొత్తు ఫిక్స్..మరికాసేపట్లో ప్రకటన
Related News
PM Modi slams Sam Pitroda: దుమారం రేపుతున్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన మోడీ
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శామ్ పిట్రోడా తన అభ్యంతరకర వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. వారసత్వ పన్నుకు సంబంధించి మాట్లాడిన శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ శామ్ పిట్రోడా వ్యాఖ్యలను తప్పు పడుతూ మండిపడ్డారు.