HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Modi Announces Pradhan Mantri Suryoday Yojna

Suryoday Yojana Scheme : ప్రాణప్రతిష్ఠ వేళ ప్రధాని మోడీ భారీ పథకం ప్రకటన..

  • Author : Sudheer Date : 22-01-2024 - 10:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shri Ram Temple
Modi Suryoday Yojana Scheme

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ (PM Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ను ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని (Suryoday Yojana Scheme) ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేశారు. దీని ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల కరెంటు బిల్లులు తగ్గుతాయని మోడీ అభిప్రాయపడ్డారు. ఇంధన రంగంలో భారతదేశం రూపురేఖలు మారతాయని ఈ సందర్బంగా పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

“ప్రపంచంలోని భక్తులందరూ ఎల్లప్పుడూ సూర్యవంశానికి చెందిన భగవంతుడు శ్రీరాముడి నుంచి శక్తిని పొందుతారు. ఈరోజు, అయోధ్యలో పవిత్ర ప్రతిష్ఠాపన సందర్భంగా భారతదేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను కలిగి ఉండాలనే నా సంకల్పం మరింత బలపడింది. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఏమిటంటే.. మా ప్రభుత్వం ఒక కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ని ప్రారంభించనుంది. ఇది పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లును తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా చేస్తుంది’’ అని మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

అలాగే మోడీ తన నివాసంలో దీపాలు వెలిగించారు. రామ ప్రతిష్ట అపూర్వ ఘట్టం సందర్భంగా సాయంత్రం వేళ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, దుకాణాల్లో దీపాలు వెలిగించాలని మోడీ పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించి రామ భక్తిని చాటుకున్నారు. ఇక నేడు అయోధ్య లో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కన్నులపండుగగా జరిగింది. వేదపండింతులు చెప్పిన ముహుర్తానికే విగ్రహ ప్రతిష్ట చేసారు. ఈ వేడుకను చూసేందుకు దేశ నలుమూలల నుండి ఎంతమంది భక్తులు , పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

Read Also : Ayodhya Ram Mandir Inauguration : వెల్లివిరిసిన మతసామరస్యం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1 crore households with rooftop solar panels
  • modi
  • Pran Pratishtha ceremony
  • Suryoday Yojana Scheme

Related News

    Latest News

    • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

    • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

    • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

    Trending News

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd