Sharad Pawar: శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ.. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా పవార్ ని కొనసాగాలన్న NCP కమిటీ..!
ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా శరద్ పవార్ (Sharad Pawar) కొనసాగనున్నారు. పార్టీ సీనియర్ నేతల కమిటీ (Panel) పవార్ రాజీనామా (Resignation)ను తిరస్కరించింది. మే 2న శరద్ పవార్ (Sharad Pawar) హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
- Author : Gopichand
Date : 05-05-2023 - 2:23 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా శరద్ పవార్ (Sharad Pawar) కొనసాగనున్నారు. పార్టీ సీనియర్ నేతల కమిటీ (Panel) పవార్ రాజీనామా (Resignation)ను తిరస్కరించింది. మే 2న శరద్ పవార్ (Sharad Pawar) హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పవార్ రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. కమిటీ సమావేశం అనంతరం ఎన్సీపీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకుడు ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. మే 2న శరద్ పవార్ అకస్మాత్తుగా తన రాజీనామాను ప్రకటించారు. తదుపరి కార్యాచరణ కోసం, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం పార్టీ నాయకుల కమిటీని ఆయన నియమించారు. ఈరోజు కమిటీ సమావేశం జరిగింది అన్నారు.
దేశానికి, పార్టీకి ఆయన అవసరం
నేను కాకుండా చాలా మంది నాయకులు పవార్ ని కలిశారని ఈ సమయంలో ఆయన దేశానికి, పార్టీకి అవసరమైనందున ఆయన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని మేము నిరంతరం అభ్యర్థిస్తున్నాము అని ప్రఫుల్ల అన్నారు. ఎన్సీపీ నేతలే కాకుండా ఇతర పార్టీ నేతలు, ప్రముఖులు కూడా ఆయనను పార్టీ చీఫ్గా కొనసాగించాలని అభ్యర్థించారు.
Also Read: Telangana Police: ఎన్నికల వేళ.. మావోయిస్టుల కదలికలపై నిఘా!
కొనసాగాలని శరద్ పవార్ను అభ్యర్థించారు
మాకు తెలియజేయకుండానే పవార్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారని ప్రఫుల్ అన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకుడి డిమాండ్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈరోజు సమావేశం నిర్వహించి కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కమిటీ ఈ రాజీనామాను ఏకగ్రీవంగా తిరస్కరించింది . పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని మేము అభ్యర్థిస్తున్నాము అన్నారు.
శరద్ పవార్ కమిటీని ఏర్పాటు చేశారు
పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పవార్ 18 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ కమిటీలో ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, పీసీ చాకో, నరహరి జిర్వాల్, అజిత్ పవార్, సుప్రియా సూలే, జయంత్ పాటిల్, ఛగన్ భుజ్బల్, దిలీప్ వాల్సే-పాటిల్, అనిల్ దేశ్ముఖ్, రాజేష్ తోపే, జితేంద్ర అవద్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, జనాయ్దేవ్ గౌడికే ఉన్నారు.