HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Pak Violates Ceasefire Near Loc In Jammu Border Police Personnel Injured

Pak Violates Ceasefire : పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్‌కు గాయాలు.. భారత్ ప్రతిఘటన

అఖ్నూర్ ఏరియాలో బీఎస్ఎఫ్ బలగాలు ప్రస్తుతం హైఅలర్ట్ మోడ్‌లో(Pak Violates Ceasefire) ఉన్నాయని తెలిపాయి.

  • By Pasha Published Date - 09:37 AM, Wed - 11 September 24
  • daily-hunt
Ceasefire Violation
Ceasefire Violation

Pak Violates Ceasefire : పాకిస్తాన్ ఆర్మీ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇవాళ తెల్లవారుజామున 2.35 గంటలకు జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్ ఏరియాలో ఉన్న సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద భారత సైన్యంపైకి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో భారత్‌కు చెందిన బీఎస్ఎఫ్ సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. పాక్ కాల్పులను బీఎస్ఎఫ్ బలగాలు తిప్పికొట్టాయి. భారత్ ప్రతిదాడిలో పాక్ వైపు ఎంతమందికి గాయాలయ్యాయి అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.  ఈవివరాలను బీఎస్ఎఫ్ అధికార వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అఖ్నూర్ ఏరియాలో బీఎస్ఎఫ్ బలగాలు ప్రస్తుతం హైఅలర్ట్ మోడ్‌లో(Pak Violates Ceasefire) ఉన్నాయని తెలిపాయి. బార్డర్ వద్ద ముమ్మర గస్తీ కొనసాగుతోందని పేర్కొన్నాయి.

Also Read :Trump Vs Kamala : ‘‘కమల పెద్ద మార్క్సిస్ట్‌’’.. ‘‘ట్రంప్‌ అమెరికాను చైనాకు అమ్మేశారు’’.. హోరాహోరీగా డిబేట్

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 2021 ఫిబ్రవరి 25న రెన్యూవల్ అయింది. అయినా తరుచుగా సరిహద్దు ఏరియాలో పాక్ కాల్పులు జరుపుతూనే ఉంది. గతేడాది కశ్మీర్‌లోని రాంఘర్ సెక్టార్‌పైకి పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో భారత బీఎస్ఎఫ్ జవాన్ అమరుడయ్యాడు. త్వరలోనే కశ్మీర్‌లో మూడు విడతల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ ఈవిధంగా భారత్‌పై కవ్వింపు దాడులకు పాల్పడటం గమనార్హం. సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1 తేదీల్లో కశ్మీరులో అసెంబ్లీ పోల్స్ జరగనున్నాయి. అక్టోబరు 8న కశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Also Read :Chakali Ailamma : కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు – సీఎం రేవంత్

1999 సంవత్సరంలో భారత్-పాక్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. అయితే ఆ యుద్ధంలో తాము పాల్గొనలేదని అప్పట్లో పాక్ ఆర్మీ చెప్పుకుంది. కొందరు ముజాహిదీన్లు ఆ యుద్ధంలో పాల్గొన్నారని ఆనాడు పాక్ వాదించింది. అప్పట్లో భారత్ వైపు పడి ఉన్న పాక్ సైనికుల డెడ్‌బాడీలను కూడా పాక్ తీసుకెళ్లలేదు. తాము చేసిన చొరబాటు బయటపడొద్దనే ఉద్దేశంతో  సైనికుల డెడ్‌బాడీలను తీసుకెళ్లేందుకు కూడా పాక్ ఆనాడు నో చెప్పింది. ఇటీవలే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ అసలు నిజమేంటో వెల్లడించారు. కార్గిల్ యుద్ధంలో ఎంతోమంది పాక్ సైనికులు చనిపోయారని ఆయన బహిరంగంగానే ఒప్పుకున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jammu Border
  • LoC
  • Pak Violates Ceasefire
  • pakistan
  • Police Personnel Injured

Related News

Upendra Dwivedi

Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

Operation Sindoor : భారత-పాక్‌ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • Attack In Balochistan

    Pakistan : బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి – 25 మంది మృతి

  • A massive earthquake shook Afghanistan, killing more than 250 people

    Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

  • Nobel Peace Prize

    Nobel Peace Prize: నోబెల్ బహుమతి పొందాలని ఆశ‌ప‌డిన ట్రంప్‌.. భారీ షాక్ ఇచ్చిన భార‌త్‌!

Latest News

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd