Terror : దేశరాజధానిలో భారీ కుట్ర భగ్నం…!!
దేశ రాజధానిలో భారీ కుట్రను భగ్నం చేశారు పోలీసులు. స్వాతంత్ర్య దినోవత్సం వేళ...ఈ కుట్ర జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
- By hashtagu Published Date - 10:12 PM, Fri - 12 August 22
దేశ రాజధానిలో భారీ కుట్రను భగ్నం చేశారు పోలీసులు. స్వాతంత్ర్య దినోవత్సం వేళ…ఈ కుట్ర జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులు పోలీసులు అరెస్టు చేశారు. ఆనందర్ విహార్ లో అరెస్టు చేసి వారి నుంచి 2,251 తూటాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీల సమయంలో అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడంతోపాటు..ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులతోపాటు మార్కెట్ల వద్ద పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. హోటల్స్, రెస్టారెంట్లలో నిరంతరం చెక్ చేస్తున్నారు. కాగా పంద్రాగస్టు నేపథ్యంలో ఢిల్లీలో పదివేల మందికిపైగా పోలీసులు మోహరించారు. రెడ్ ఫోర్టుకు వచ్చే దారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Related News
Latest Report: మానసిక సమస్యలతో చిత్తవుతున్న ఢిల్లీ యువత.. ఎందుకో తెలుసా
Latest Report: డిప్రెషన్తో బాధపడే వారు చిన్న వయస్సులోనే ఉన్నారని చాలా అధ్యయనాల్లో తేలింది. వారు పెరిగిన తర్వాత కూడా మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. మానసిక వ్యాధుల లక్షణాలు మొదట్లో చిన్నవిగా ఉన్నా తర్వాత తీవ్రమవుతాయి. ప్రాథమిక విచారణలో వైద్యులు కూడా వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. దీని కారణంగా మానసిక వ్యాధులు గణనీయంగా పెరుగుతాయి. ఎయిమ్స్ ఇటీవలి నివేదిక నగరాల్లో వేగ�