Maharashtra Cabinet : మహిళల్లేని `మహా` మంత్రివర్గం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 41 రోజుల తర్వాత తన రెబల్ శివసేన గ్రూప్ మరియు బిజెపికి చెందిన తొమ్మిది మంది మొత్తంగా 18 మంది మంత్రులను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
- By CS Rao Published Date - 09:00 PM, Tue - 9 August 22
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 41 రోజుల తర్వాత తన రెబల్ శివసేన గ్రూప్ మరియు బిజెపికి చెందిన తొమ్మిది మంది మొత్తంగా 18 మంది మంత్రులను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రులు జాబితాలో ఒక మహిళ కూడా లేకపోవడం గమనార్హం. ఈ చర్యను రాజకీయ నాయకులు మహిళా హక్కుల కార్యకర్తలు తప్పుబడుతున్నారు.
దేశంలోనే మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం మహారాష్ట్ర. భారత జనాభాలో 50 శాతం మంది మహిళలు ఉండగా, రాష్ట్ర మంత్రివర్గంలో వారికి ప్రాతినిధ్యం లేదని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ఇది బీజేపీ ఆలోచనా ధోరణిని తెలియజేస్తోందని ఆమె అన్నారు. మంగళవారం దక్షిణ ముంబైలోని రాజ్ భవన్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సహా 18 మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మహారాష్ట్ర మంత్రిత్వ శాఖ బలం ఇప్పుడు 20కి పెరిగింది. మంత్రివర్గంలోకి గరిష్టంగా 43 మందిని తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ 20 మంది మాత్రమే ఇప్పటి వరకు ఉన్నారు.
గవర్నర్ బీఎస్ కోశ్యారీ మంత్రులతో ప్రమాణం చేయించారు. జూన్ 30న షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త భాజపా మంత్రులు రాధాకృష్ణ విఖే పాటిల్, సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్, విజయ్కుమార్ గవిట్, గిరీష్ మహాజన్, సురేష్ ఖాడే, రవీంద్ర చవాన్, అతుల్ సేవ్ మరియు మంగళ్ప్రభాత్ లోధా మంత్రివర్గంలో స్థానం పొందారు.
షిండే గ్రూపు నుంచి గులాబ్రావ్ పాటిల్, దాదా భూసే, సంజయ్ రాథోడ్, సందీపన్ బుమ్రే, ఉదయ్ సమంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్, శంభురాజ్ దేశాయ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని షిండే సన్నిహితుడు తెలిపారు. ముంబైకి చెందిన లోధాను బిజెపి చేర్చుకున్నప్పటికీ, ఈ ఏడాది చివర్లో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న ఆర్థిక రాజధాని నుండి షిండే గ్రూప్ ఏ శాసనసభ్యుడిని చేర్చుకోలేదు.
కొత్త మంత్రుల్లో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన షిండే గ్రూపు ఎమ్మెల్యే సంజయ్ రాథోడ్ ఉన్నారు. ఒక మహిళ ఆత్మహత్యకు బీజేపీ నేతలు కారణమని ఆరోపించడంతో ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. ఇప్పుడు రాథోడ్ను కేబినెట్లోకి తీసుకోవడంపై రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు చిత్రా వాఘ్ నిరసన వ్యక్తం చేశారు. రాథోడ్కు మళ్లీ మంత్రి పదవి వచ్చినా ఆయనపై పోరాటం కొనసాగిస్తానని ఆమె తెలిపారు.
Related News
13 Killed : మహారాష్ట్ర లో విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది మృతి
మహారాష్ట్రలోని రాయ్ఘడ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మరణించగా.. 100