HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Narendra Modi First Pm To Lower Dignity Of Public Discourse Manmohan Singh

Manmohan Singh : ప్రధాని పదవి గౌరవాన్ని మోడీ తగ్గించారు.. మన్మోహన్‌సింగ్ కీలక వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ విరుచుకుపడ్డారు.

  • By Pasha Published Date - 02:13 PM, Thu - 30 May 24
  • daily-hunt
Manmohan Singh
Manmohan Singh

Manmohan Singh : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ విరుచుకుపడ్డారు. ‘‘ప్రధానమంత్రి లాంటి ఉన్నత పదవిలో ఉంటూ దేశంలోని ఓ నిర్దిష్ట వర్గంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రధాని పదవి గౌరవాన్ని మోడీ తగ్గించారు’’ అని ఆయన విమర్శించారు. జూన్ 1న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో మన్మోహన్ సింగ్ కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధాని మోడీ విద్వేషపూరిత ప్రసంగాల ద్వారా దేశాన్ని రెండుగా విభజించే ప్రయత్నం చేశారని అభిప్రాయపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మోడీ గతంలో హామీ ఇచ్చారు. అయితే గత 10 ఏళ్లలో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు అలుముకున్నాయి. రైతులకు వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం రైతుల నెలవారీ ఆదాయపు జాతీయ సగటు విలువ రోజుకు రూ.27 కంటే తక్కువే ఉంది.  ఒక్కో రైతుకు సగటున రూ. 27,000 అప్పు ఉంది. వ్యవసాయ ఎగుమతి, దిగుమతుల విషయంలో మోడీ సర్కారు విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంది. దీనివల్ల వ్యవసాయ కుటుంబాల పొదుపు మొత్తాలు చాలా తగ్గాయి. రైతులను పేదరికం ఆవరించింది’’ అని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తన లేఖలో ప్రస్తావించారు.

Also Read :Hair In Stomach : ఆమె కడుపులో రెండున్నర కేజీల వెంట్రుకలు.. డాక్టర్లు షాక్!

‘‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని ప్రజల పాలిట పెను విపత్తుగా మారింది. లోపభూయిష్ట జీఎస్టీ విధానం ఎంతోమంది వ్యాపారులను దెబ్బతీసింది. కరోనా సంక్షోభ సమయంలో దేశ ప్రజల బాగు కోసం సరైన ప్రణాళికలను అనుసరించలేదు. దీనివల్లే దేశ ఆర్థిక పురోగతి నెమ్మదించింది’’ అని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘‘పంజాబ్‌కు చెందిన ఎంతోమంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతూ చనిపోయారు. వారితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు. నిరంకుశ వైఖరితో మోడీ పాలన సాగిస్తుండటం ఆందోళనకరం. ఢిల్లీ శివార్లలో రైతుల నిరసనలను కట్టడి చేసేందుకు లాఠీలు, రబ్బరు బుల్లెట్‌లు సరిపోవన్నట్లుగా.. ప్రధాని మోడీ మాటలతోనూ అన్నదాతలపై దాడి చేశారు’’ అని మాజీ ప్రధాని వ్యాఖ్యానించారు. ‘‘తమను సంప్రదించకుండానే అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే ఏకైక డిమాండ్‌తో రైతులు నిర్వహించిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు.  గత పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్, పంజాబీలు, పంజాబియాత్‌లను దూషించేందుకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క అంశాన్ని కూడా విడిచిపెట్టలేదు’’ అని మాజీ ప్రధాని(Manmohan Singh) తెలిపారు.

Also Read :PM Candidate : 48 గంటల్లో ప్రధాని అభ్యర్థిపై ప్రకటన.. గతంలో టీడీపీ మా మిత్రపక్షమే : జైరాం రమేశ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Manmohan singh
  • narendra modi
  • pm modi

Related News

PM Modi Degree

Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

Narendra Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనపై చేసిన వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ట్రంప్‌ తనను “గొప్ప ప్రధానమంత్రి” అని అభివర్ణించిన మాటలను మోడీ స్వాగతిస్తూ, ఇరు దేశాల సంబంధాలు ఎప్పటికీ బలంగా, సానుకూలంగానే కొనసాగుతాయని తెలిపారు.

  • Tensions in India-US relations: Modi absent from UN meetings!

    PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

  • We have distanced ourselves from India..Trump's key comments

    Trump : ‘భారత్‌కు దూరమయ్యాం’..ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • New GST

    New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

Latest News

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd