HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Modi Govt Committed Treason Rahul Gandhi Reacts To Report On Pegasus Spyware

Pegasus spyware : దేశంలో `పెగాసిస్` దుమారం

భార‌త ప్ర‌భుత్వం గూఢచారి సాధ‌నం `స్పైవేర్ పెగాస‌స్` ను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింద‌ని న్యూయార్క్ టైమ్స్ ప్ర‌చురించిన క‌థ‌నం రాజ‌కీయ క‌ల్లోలాన్ని లేపుతోంది.

  • By Hashtag U Published Date - 02:19 PM, Sat - 29 January 22
  • daily-hunt

భార‌త ప్ర‌భుత్వం గూఢచారి సాధ‌నం `స్పైవేర్ పెగాస‌స్` ను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింద‌ని న్యూయార్క్ టైమ్స్ ప్ర‌చురించిన క‌థ‌నం రాజ‌కీయ క‌ల్లోలాన్ని లేపుతోంది. దేశంలోని ప్ర‌ముఖులు, విప‌క్షాలు, జ‌డ్జిల ఫోన్ల‌ను టాపింగ్ చేయ‌డానికి 2017లో పెగాస‌స్ ను ఉప‌యోగించింద‌ని కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు. `ఇలాంటి గూఢ‌చ‌ర్యం దేశద్రోహం..మోడీ ప్ర‌భుత్వం దేశ‌ద్రోహానికి పాల్ప‌డింది..`అంటూ రాహుల్ ట్వీట్ చేశాడు. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేస్తూ.. ‘మోదీ ప్రభుత్వం భారత్‌కు శత్రువుల్లా ప్రవర్తించి భారత పౌరులపై యుద్ధ ఆయుధాన్ని ఎందుకు ప్రయోగించింది? అంటూ నిల‌దీశాడు. “పెగాసస్‌ను ఉపయోగించి అక్రమంగా స్నూపింగ్ చేయడం దేశద్రోహానికి సమానం. చట్టానికి ఎవరూ అతీతులు కాదు, మేము న్యాయం జరిగేలా చూస్తాము” అని ఖ‌ర్గే ట్వీట్ చేశాడు.

मोदी सरकार ने हमारे लोकतंत्र की प्राथमिक संस्थाओं, राज नेताओं व जनता की जासूसी करने के लिए पेगासस ख़रीदा था। फ़ोन टैप करके सत्ता पक्ष, विपक्ष, सेना, न्यायपालिका सब को निशाना बनाया है। ये देशद्रोह है।

मोदी सरकार ने देशद्रोह किया है। pic.twitter.com/OnZI9KU1gp

— Rahul Gandhi (@RahulGandhi) January 29, 2022

Why did Modi Govt act like the enemies of India and use a warfare weapon against Indian citizens?

Illegal snooping using Pegasus amounts to treason. No one is above the law and we will ensure that justice is served.https://t.co/qTIqg3yNdq

— Mallikarjun Kharge (@kharge) January 29, 2022

మీడియా కథనాన్ని ఉటంకిస్తూ, కాంగ్రెస్ ప్రతినిధి షామా మహమ్మద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా భారత పౌరులపై స్నూప్ చేయడానికి బిజెపి ప్రభుత్వం మిలటరీ-గ్రేడ్ స్పైవేర్‌ను ఉపయోగించిందనడానికి ఇది “తిరుగులేని రుజువు” అని అన్నారు.న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నంలోని ప‌రిశోధ‌నాత్మ‌క అంశాలను ఆనాడు సుప్రీంకోర్టు, పార్లమెంటు దృష్టికి వెళ్ల‌కుండా ప్ర‌భుత్వం “తప్పుదోవ పట్టించింద‌ని రాజ్యసభ ఎంపీ , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శక్తిసిన్హ్ గోహిల్ ఆరోపించారు.ఇజ్రాయెల్‌తో ఒప్పందంలో భాగంగా భారత ప్రభుత్వం 2017లో పెగాసస్ గూఢచారి సాధనాన్ని కొనుగోలు చేసింది. ఆ విష‌యాన్ని తాజాగా న్యూయార్క్ టైమ్స్ కథనం తేల్చింది.
‘రాష్ట్ర నేతలు, ప్రజలపై నిఘా పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసింది. అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని, కోర్టును టార్గెట్‌ చేసి వారి ఫోన్‌ ట్యాప్‌ చేసింది.. ఇది దేశద్రోహం.. మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడింది’ అని విప‌క్ష‌నేత‌లు ప‌లువురు ట్వీట్ చేస్తున్నారు. వాస్త‌వంగా పెగాసిస్ స్పైవేర్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రాక‌ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ పై విప‌క్షాలు అనుమానాలు వ్య‌క్తం చేశాయి. ఆ త‌రువాత పెగాసిస్ బ‌య‌ట‌కు రావ‌డంతో సుప్రీం కోర్టు, పార్ల‌మెంట్ వ‌ర‌కు దీనిపై వివాదం న‌డిచింది. దేశంలోని ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, జ‌డ్జిలు, పారిశ్రామికవేత్త‌ల ఫోన్లు ట్యాప్ జ‌రిగిందని విప‌క్షాలు ఆరోపించాయి. దానిపై ప్ర‌భుత్వం వైపు నుంచి మ‌రో ర‌కంగా వాద‌న బ‌య‌లు దేరింది. ఒప్పందం ప్ర‌కారం ఇజ్రాయెల్ నుంచి పెగాసిస్ ను కొనుగోలు చేసిన మాట వాస్తవం. ఆ త‌రువాత దాన్ని ఎలా ఉప‌యోగించారో తెలియ‌చేస్తూ ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాన్ని తాజాగా ప్ర‌చురించింది. దీంతో మ‌రోసారి పెగాసిస్ వ్య‌వ‌హారం దుమారం రేపుతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pegasus spyware case
  • rahul gandhi

Related News

Cwc Meet

CWC meet: పాట్నాలో ప్రారంభమైన కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం – బీహార్ ఎన్నికలపై వ్యూహరచన

స్వాతంత్ర్యం తర్వాత బీహార్‌లో తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఇదే కావడం ప్రత్యేకత. కాంగ్రెస్ పార్టీ ఈ భేటీలో రెండు కీలక తీర్మానాలను ఆమోదించే అవకాశముందని సమాచారం.

    Latest News

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

    • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

    • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd