Mekedatu Padayatra : మేకేదాటు పాదయాత్రపై ‘కోవిడ్’ పాలిటిక్స్
కర్ణాటక కాంగ్రెస్ చేస్తోన్న మేకేదాటు పాదయాత్ర అక్కడి కాంగ్రెస్, అధికారంలోని బీజేపీ మధ్య రాజకీయ యుద్ధాన్ని రాజేసింది. కోవిడ్ కారణంగా పాదయాత్రను బెంగుళూరు నగరంలోకి ప్రవేశించకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, భారీ ర్యాలీని నిర్వహించడం ద్వారా బెంగుళూరు నగర పరిధిలోనే పాదయాత్రను ముగించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
- By CS Rao Published Date - 04:35 PM, Wed - 12 January 22
కర్ణాటక కాంగ్రెస్ చేస్తోన్న మేకేదాటు పాదయాత్ర అక్కడి కాంగ్రెస్, అధికారంలోని బీజేపీ మధ్య రాజకీయ యుద్ధాన్ని రాజేసింది. కోవిడ్ కారణంగా పాదయాత్రను బెంగుళూరు నగరంలోకి ప్రవేశించకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, భారీ ర్యాలీని నిర్వహించడం ద్వారా బెంగుళూరు నగర పరిధిలోనే పాదయాత్రను ముగించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న పలువురు కాంగ్రెస్ లీడర్లకు కోవిడ్ పాజిటివ్ ఉంది. అందుకే, పాదయాత్రను విరమించాలని ప్రభుత్వం కోరుతోంది.జనవరి 14 నుంచి 19 వరకు బెంగుళూరులో పాదయాత్రను భారీ ర్యాలీతో ముగించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. నగర పరిధిలోకి రాకుండా కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోవడం లేదా దారి మళ్లించేలా ప్రభుత్వంలో ఉన్నత స్థాయి చర్చ జరుగుతోంది. బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున నగర పరిధిలో పాదయాత్రకు బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సానుకూలంగా లేరని కాంగ్రెస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. రాష్ట్రంలోని కోవిడ్ సంక్షోభంపై బుధవారం బుధవారం నాడు కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర సమీక్షించాడు. ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరగడానికి కారణంగా కాంగ్రెస్ చేస్తోన్న పాదయాత్రగా ఆయన భావిస్తున్నాడు.రాజకీయ లబ్ది పొందడంపైనే కాకుండా ప్రజారోగ్యం గురించి ఆలోచించాలని కాంగ్రెస్ నేతలకు హోం మంత్రి హితవు పలికాడు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కాంగ్రెస్ నేతలు కోవిడ్-19కి పాజిటివ్ పరీక్షించి ఆసుపత్రిలో చేరారు. కార్యక్రమాన్ని ముగించాలని కాంగ్రెస్ నాయకులకు మరోసారి హోంమంత్రి విజ్ఞప్తి చేశాడు. కోవిడ్ -19 పరిస్థితి సమాజంలోని అన్ని వర్గాలపై, ముఖ్యంగా పేదలు , శ్రామిక వర్గాలపై తీవ్రంగా దెబ్బతింటుందని మంత్రి అన్నాడు. ఇప్పటికైనా పాదయాత్రను విరమించుకోవాలని సూచించాడు.
Related News
Telangana Congress: కర్ణాటక ఫార్ములా షురూ.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం .
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కీలకమైంది మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఈ కార్యక్రమం అక్కడి ప్రజలను విశేషంగా ఆకర్షించి.