Delhi: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖలు, ఆప్ ఎమ్మెల్యేలకు 25 కోట్ల ఆఫర్ అంటూ
- By Balu J Published Date - 01:15 PM, Sat - 27 January 24
Delhi: ఢిల్లీ నిక్కర్ స్కామ్ దేశంలో ఎంత సంచలనమైందో మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఈడి ఈ కేసులో మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయిన ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీ వాళ్లను అరెస్టు చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అయినా అరవింద్ క్రేజీవాల్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడి చేసి అరెస్టు చేయనున్నారనే వార్తలు గత కొద్దికాలంగా వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ. 25 కోట్ల ఆఫర్తో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ శాసనసభ్యులతో బిజెపి చర్చలు జరుపుతోందని, ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రిని త్వరలో అరెస్టు చేస్తామని బెదిరించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఏడుగురికి బిజెపి నుంచి టికెట్లు కూడా ఇస్తామని ఆశ చూపిందని ఆరోపించారు. అటు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఆరోపణలను బిజెపి ఖండించింది.
ఈ విషయమై ఢిల్లీ మంత్రులతో సహా అం ఆద్మీ పార్టీ నేతలు కొంతమంది మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఢిల్లీ సీఎం అరవింద్ పేజ్ ఇవ్వాలని అరెస్టు చేసే అవకాశం ఉందని వారు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ద్వారా తెలుస్తుంది. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీ వాల్ ని అరెస్టు చేసే ముందు క్రేజీ వాళ్ళ ఇంటిని పూర్తిగా సోదాలు చేయవచ్చని పార్టీ నేతలు తెలియజేస్తున్నారు.
Related News
Arvind Kejriwal: రేపు బీజేపీ ఆఫీస్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి మే 19 ఆదివారం మధ్యాహ్నం బీజేపీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్ర చేస్తానని, అయితే మోడీ కోరుకున్న వారిని అరెస్టు చేసుకోవాలని సవాల్ విసిరారు.