HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Jagdeep Dhankhar Says Pm Modi Told Me He Has Been Receiving Such Insults For 20 Years

20 Years Insults : 20 ఏళ్లుగా నేనూ అవమానాలు భరిస్తున్నా.. ఉపరాష్ట్రపతితో ఫోన్‌కాల్‌లో ప్రధాని

20 Years Insults : మంగళవారం రోజు సస్పెన్షన్‌కు గురైన విపక్ష ఎంపీలు పార్లమెంటు భవనం మకర ద్వారం వద్ద నిరసన తెలుపుతుండగా.. వారిలో కొందరు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ను అనుకరించారు.

  • By Pasha Published Date - 12:03 PM, Wed - 20 December 23
  • daily-hunt
20 Years Insults
20 Years Insults

20 Years Insults : మంగళవారం రోజు సస్పెన్షన్‌కు గురైన విపక్ష ఎంపీలు పార్లమెంటు భవనం మకర ద్వారం వద్ద నిరసన తెలుపుతుండగా.. వారిలో ఓ ఎంపీ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ను అనుకరించారు. ఈవిషయం మీడియా ద్వారా తెలియడంతో ఉపరాష్ట్రపతికి  ప్రధాని మోడీ ఫోన్ కాల్ చేశారు. ఇలా జరగడంపై విచారం వ్యక్తం చేశారు.  తాను కూడా గత 20 ఏళ్లుగా ఇలాంటి అవమానాలనే అనుభవిస్తున్నానని(20 Years Insults) ప్రధాని చెప్పారంటూ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ఓ ట్వీట్ చేశారు.  వైస్ ప్రెసిడెంట్ వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారికి సాక్షాత్తూ పార్లమెంటులో ఇలా జరగడం దురదృష్టకరమని ప్రధాని పేర్కొన్నట్లు తెలిపారు. ‘‘కొంతమంది వెకిలి చర్యలు విధి నిర్వహణలో నన్ను ఆపలేవు. మన రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలను అమలు చేయకుండా నన్ను ఆపలేవు’’ అని తాను ప్రధానికి చెప్పానని జగ్‌దీప్‌ ధన్‌కర్‌ తెలిపారు. ‘‘నేను విలువలకు కట్టుబడి నడుచుకునే మనిషిని. వాటిని ఎన్నటికీ విడనాడను. ఎంతటి అవమానమైనా  నా మార్గం నుంచి నన్ను దారి తప్పించలేదు’’ అని పీఎంకు చెప్పినట్లు ఉప రాష్ట్రపతి వివరించారు.

Received a telephone call from the Prime Minister, Shri @narendramodi Ji. He expressed great pain over the abject theatrics of some Honourable MPs and that too in the sacred Parliament complex yesterday. He told me that he has been at the receiving end of such insults for twenty…

— Vice-President of India (@VPIndia) December 20, 2023

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏమన్నారంటే.. 

ఇక ఈ ఘటనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఖండించారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఉపరాష్ట్రపతిని అవమానించేలా కొందరు ఎంపీలు ప్రవర్తించిన తీరును చూసి నిరాశకు గురైనట్లు చెప్పారు. పార్లమెంటు సభ్యులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వాడుకోవచ్చని.. అయితే అందులో గౌరవభావం ఉండాలని హితవు పలికారు. భారతదేశం గర్వించదగిన పార్లమెంటరీ సంప్రదాయాలను కొనసాగించాలని సూచించారు.

Also Read: Modi Vs Kharge : ఖర్గే వర్సెస్ మోడీ.. ప్రధాని అభ్యర్ధి ఛాన్స్ కాంగ్రెస్ చీఫ్‌కేనా ?

అసలేం జరిగింది ?

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మంగళవారం వరకు 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. డిసెంబరు 13న లోక్‌సభలో ఇద్దరు దుండగులు హల్‌చల్ చేసిన వ్యవహారంలో కేంద్ర హోంమంత్రి నుంచి ప్రకటనను ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఆ అంశంపై ఉభయ సభల్లో చర్చించాలని పట్టుబట్టారు. ఈ డిమాండ్లతో నిరసన తెలిపిన 141 మంది ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో సస్పెండ్ అయ్యారు. తాజాగా మంగళవారం 49 మంది లోక్‌సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈనేపథ్యంలో మంగళవారం రోజు పార్లమెంట్ హౌస్ మకర ద్వారం వద్ద విపక్ష ఎంపీలు కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ.. రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధ‌న్‌కర్‌ను అనుకరించారు.

I was dismayed to see the manner in which our respected Vice President was humiliated in the Parliament complex. Elected representatives must be free to express themselves, but their expression should be within the norms of dignity and courtesy. That has been the Parliamentary…

— President of India (@rashtrapatibhvn) December 20, 2023


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 20 Years Insults
  • Jagdeep Dhankhar
  • pm modi

Related News

Railway Employees

Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

షిప్పింగ్, మారిటైమ్ రంగాల అభివృద్ధి, సంస్కరణల కోసం కేంద్ర కేబినెట్ రూ. 69,725 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ముఖ్యంగా షిప్‌ల తయారీ, షిప్పింగ్ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • GST 2.0

    GST 2.0: ఇక‌పై అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే వ‌స్తువులీవే!

  • Dhanyavaad Modi JI Padayatra

    Dhanyavaad Modi JI Padayatra: జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై ‘ధ‌న్య‌వాద్‌ మోడీ జీ’ పాద‌యాత్ర.. పాల్గొన్న బీజేపీ ఎంపీ!

  • Jagan

    Jagan: కొత్త జీఎస్టీపై జ‌గ‌న్ కీల‌క ట్వీట్‌.. ఏమ‌న్నారంటే!

Latest News

  • Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

  • L&T : L&T వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డినే – కేటీఆర్

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd