HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Indias Population May Shrink By 41 Crore By 2100

India Population: 41 కోట్లు తగ్గిపోనున్న ఇండియా జనాభా.. 2100 నాటికి 100 కోట్లకు డౌన్!!

ప్రస్తుతం మన దేశ జనాభా దాదాపు 141 కోట్లు.. 2100 నాటికి ఇది 100 కోట్లకు పడిపోతుందట!!

  • By Hashtag U Published Date - 08:15 AM, Mon - 25 July 22
  • daily-hunt
Covid Fourth Wave Imresizer
Covid Fourth Wave Imresizer

ప్రస్తుతం మన దేశ జనాభా దాదాపు 141 కోట్లు.. 2100 నాటికి ఇది 100 కోట్లకు పడిపోతుందట!!
రాబోయే 78 ఏళ్లలో మన జనాభా ఏకంగా 41 కోట్లు తగ్గిపోతుందట!!
అమెరికాలోని స్టాన్‪‌ఫోర్డ్ యూనివర్సిటీ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో ఈవిషయాన్ని ప్రస్తావించారు.

ఎందుకు తగ్గుతుంది?

అధ్యయన నివేదిక ప్రకారం.. దేశ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయి క్రమంగా జనాభా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.జనాభా విపరీతంగా పెరిగిపోయినప్పుడు వనరులు భారీగా తగ్గిపోతాయి. దీనివల్ల జీవన ప్రమాణాలు తగ్గుతాయి. అంతిమంగా జనాభా తగ్గుదల మొదలవుతుంది.సంతానోత్పత్తి రేటు తగ్గడం కూడా జనాభా తగ్గుదలకు కారణమవుతుంది. మన దేశంలో ఒక మహిళ సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం 1.76గా ఉండగా, 2032 సంవత్సరం నాటికి 1.39, 2052 నాటికి 1.28, 2082 నాటికి 1.2, 2100 సంవత్సరం నాటికి 1.19గా ఉండే అవకాశం ఉంది. భారత్‌తో పాటు చైనా, అమెరికాలోనూ వచ్చే 78 ఏళ్లలో జనాభా తగ్గిపోనుంది. ముఖ్యంగా చైనా జనాభా 2100 నాటికి 49 కోట్లకు పడిపోనుంది. అక్కడ సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుండటమే ఇందుకు కారణం.

జనసాంద్రత కూడా డౌన్..

రానున్న రోజుల్లో భారత జనసాంద్రత ఆందోళనకర స్థాయిలో పడిపోతుందని నివేదిక చెప్పింది.జనాభా విషయంలో భారత్, చైనా ఒకేలా కన్పిస్తున్నప్పటికీ.. జనసాంద్రతకు వచ్చేసరికి చాలా వ్యత్యాసం ఉంది.
జనాభాలో మనం చైనా తర్వాత ఉన్నప్పటికీ.. జన సాంద్రతలో మాత్రం మనమే ముందున్నాం. భారత్‌లో ప్రతి చదరపు కిలోమీటర్‌కు 476మంది నివసిస్తారు. చైనాలో మాత్రం ఆ సంఖ్య 148 మంది మాత్రమే.  2100 నాటికి భారత్‌లో జనసాంద్రత 335కి పడిపోతుందని, ఇది ప్రపంచం మొత్తంతో పోల్చితే చాలా ఎక్కువ అని అధ్యయనం అంచనా వేసింది.
2100 నాటికి మన దేశంలో చదరపు కిలోమీటరుకు 335 మంది జీవిస్తే, చైనాలో 51 మందే జీవిస్తారు. చదరపు కిలోమీటరుకు అమెరికాలో ప్రస్తుతం సగటున 37 మంది జీవిస్తే, 2100కల్లా 31 మంది నివసిస్తారు.జపాన్‌లో ప్రస్తుతం 329 మంది జీవిస్తే, 2100 నాటికి 133 మంది మాత్రమే జీవిస్తారు. అంటే మన దేశంతోపాటు అన్ని దేశాల్లోనూ జనాభా, జన సాంద్రత విపరీతంగా తగ్గుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • india population
  • population density
  • population to shrink

Related News

Nepal Currency

Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?

చైనా ప్రతి రంగంలోనూ తన పట్టును బలోపేతం చేసుకుంటోంది. కరెన్సీ ముద్రణలో కూడా అదే చేసింది. చైనా బ్యాంక్‌నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ (CBPMC) అనే చైనా ప్రభుత్వ సంస్థ ఇప్పుడు నేపాల్ కరెన్సీని ముద్రిస్తోంది.

  • Hal Gubbi Volcano

    Volcano : బద్దలైన అగ్నిపర్వతం.. భారత్ పై ఎఫెక్ట్

  • Indian Girl

    Indian Girl: చైనాలో భార‌త మహిళకు వేధింపులు.. 18 గంటలు హింసించిన అధికారులు!

  • India

    India: పాకిస్తాన్‌కు భారత్ భారీ షాక్.. కొత్త ఆయుధంతో వణుకుతున్న శత్రుదేశాలు!

  • Terror Attack8

    Terror Attack Plan : మరో ఉగ్ర దాడికి జైషే కుట్ర?

Latest News

  • Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసులో ఇద్దరు నిందితులకు రిమాండ్!

  • Indian Constitution: భారత రాజ్యాంగం.. డా. అంబేద్కర్ ఒక్కరే రాశారా?

  • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చ‌నిపోయారా? 3 వారాలుగా కుటుంబానికి నో ఎంట్రీ!

  • Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్

  • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

Trending News

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

    • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd