Agni 5 Missile : ఇండియా ఖాతాలో మరో క్రెడిట్
క్షిపణి పరీక్షల్లో ఇండియా మరో సక్సెస్ స్టెప్ వేసింది. ఒక భూభాగం పైనుండి మరో భూభాగంపైకి ప్రయోగించే అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.
- By Hashtag U Published Date - 11:33 AM, Thu - 28 October 21
క్షిపణి పరీక్షల్లో ఇండియా మరో సక్సెస్ స్టెప్ వేసింది. ఒక భూభాగం పైనుండి మరో భూభాగంపైకి ప్రయోగించే అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. 5,000 కిలోమీటర్లకుపైగా నిర్దేశిత లక్ష్యాన్ని ఆగ్ని-5 ఖచ్చితత్వంతో చేరుకుంది. అగ్ని-5 క్షిపణి 5వేల నుంచి 8వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదించనున్నట్లు సమాచారం.మూడు-దశల ఘన ఇంధనంతో కూడిన ఇంజిన్ను ఉపయోగించే ఈ క్షిపణి అత్యంత ఎక్కువ ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు.
ఈ క్షిపణిని డీఆర్డీఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వాస్తవానికి అగ్ని-5 పరీక్ష 2020లోనే జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడింది. అగ్ని రకం క్షిపణిని భారత్ తొలిసారి 2012లో విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. అగ్ని-1 700 కి.మీ., అగ్ని-2 2,000 కి.మీ., అగ్ని-3 2,500 కి.మీ., అగ్ని-4 3,500 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగల సామర్థ్యంలో రూపొందించారు. ఈ పరీక్షలన్నీ విజయవంతమయ్యాయి. తాజా ప్రయోగంతో భారత్ శక్తి ప్రపంచానికి మరోసారి తెలిసినట్టయ్యింది. సరిహద్దుల్లో చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్న వేళ తాజా ప్రయోగంతో భారత్ గట్టి సందేశం పంపిందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు
Related News
China : చైనా మునిగిపోతుంది.. సంచలన అధ్యయన నివేదిక
Satellite Data : చైనా(China) యొక్క పట్టణ జనాభాలో మూడింట ఒక వంతు మంది భూమి క్షీణత కారణంగా ప్రమాదంలో ఉన్నట్లు అంచనా వేయబడింది. అయితే ఈ విషయం ప్రపంచ దృగ్విషయాన్ని సూచిస్తుందని పరిశోధకులు చెప్పిన కొత్త అన్వేషణలో పేర్కొన్నారు. సముద్ర మట్టానికి దిగువన ఉన్న చైనా పట్టణ ప్రాంతం 2120 నాటికి మూడు రెట్లు పెరిగి 55 నుండి 128 మిలియన్ల మంది నివాసితులను ప్రభావితం చేయగలదని కనుగొంది. We’re now on WhatsApp. Click […]