Venkaiah Naidu : వెంకయ్యకు మోడీ భావోద్వేగ వీడ్కోలు
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి వీడ్కోలు పలికే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ భావోద్యేగానికి గురయ్యారు.
- By CS Rao Published Date - 03:24 PM, Mon - 8 August 22
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి వీడ్కోలు పలికే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ భావోద్యేగానికి గురయ్యారు. రాజ్యసభలో జరిగిన వీడ్కోలు సభ సందర్భంగా మోడీ ప్రసంగించారు. దేశానికి వెంకయ్యనాయుడు అందించిన సేవల్ని కొనియాడారు. ప్రధాని మోదీ ఉద్వేగభరితమైన ప్రసంగం వెంకయ్యనాయుడును చలించిపోయేలా చేసింది. ఒకానొక సందర్భంలో ఆయన కళ్లు చెమ్మగిల్లినట్లు కనిపించారు. ఆగస్టు 10వ తేదీతో రాజ్యసభ ఛైర్మన్గా వెంకయ్యనాయుడు ఐదేళ్ల పదవీకాలం ముగియనుంది.
వెంకయ్య నాయుడుకు వీడ్కోలు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ, “మీరు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారని, ప్రజా జీవితంతో అలసిపోలేదని ఎప్పటినుంచో చెబుతుంటారు. మీ పదవి కాలం ముగిసిపోవచ్చు, కానీ రాబోయే సంవత్సరాల్లో మీ అనుభవాల నుండి దేశం ప్రయోజనం పొందుతూనే ఉంటుంది. ఎం. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా , రాజ్యసభ ఛైర్మన్గా ఐదేళ్లపాటు కొనసాగారని, ఆ సమయంలో సభ ఉత్పాదకత 70% పెరిగింది` అంటూ వెంకయ్యనాయుడు తెలివితేటలను కొనియాడారు.
పదవీ విరమణ చేసిన రాజ్యసభ ఛైర్మన్ ప్రసంగాన్ని కొనియాడారు. తన వారసులకు మార్గనిర్దేశం చేసే నిబంధనలను వారసత్వాన్ని నిర్దేశించారని ప్రసంశించారు. రాజ్యసభలో నాయుడుకు తన భావోద్వేగ వీడ్కోలు అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఉద్వేగభరితమైన ప్రసంగంతో ఉపరాష్ట్రపతి చలించిపోయి కళ్లు చెమ్మగిల్లినట్లు కనిపించారు.
Related News
KCR Bus Yatra: రేవంత్ ఛోటా భాయ్.. మోడీ బడే భాయ్: కేసీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటా భాయ్, నరేంద్ర మోడీ బడే భాయ్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. రేవంత్, మోడీ ఇద్దరూ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.