కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా.. ప్రియాంక గాంధీ 6 ప్రధాన హామీలు!
ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శకం నడుస్తోంది. బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడతూ మోడీ సర్కార్ పై యుద్ధం చేస్తోంది.
- By Balu J Published Date - 04:14 PM, Sat - 23 October 21
ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శకం నడుస్తోంది. బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడతూ మోడీ సర్కార్ పై యుద్ధం చేస్తోంది. తనదైన స్టయిల్ అవాక్కులు, చలోక్తులు విసురుతూ బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రియాంక గాంధీ వాద్రా శనివారం మూడు ప్రతిజ్ఞ యాత్రలను ప్రారంభించనున్నారు. అక్టోబరు 23 నుంచి నవంబరు 1 వరకు ఈ యాత్రలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుపు కోసం ఆరు ప్రధాన హామీలు ఇచ్చారు. అవి ఏమిటంటే..
- 12 వ తరగతి చదివే అమ్మాయిలకు స్మార్ట్ఫోన్లు, గ్రాడ్యుయేట్ విద్యార్థినులకు స్కూటీలు.
- రైతుల రుణ మాఫీ. గతంలో 72 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తాం.
- ఛత్తీస్గఢ్ మాదిరిగానే యూపీలో గోధుమలు, వరి ధరలను రూ.2500గా నిర్ణయిస్తాం. చెరకు మద్దతు ధర క్వింటాలుకు రూ .400 ఉంటుంది.
- కోవిడ్ -19 సమయంలో విద్యుత్ బిల్లులను పూర్తిగా రద్దు చేస్తాం. ప్రతిఒక్కరి విద్యుత్ బిల్లును సగానికి తగ్గిస్తాం.
- కరోనా కాలంలో సంపాదించలేని పేద కుటుంబాలకు రూ.25,000 ఆర్థిక సాయం అందిస్తాం.
- రాష్ట్రంలో 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందించడానికి శ్రమిస్తాం. కాంట్రాక్టు కార్మికులను కూడా క్రమబద్ధీకరిస్తాం.
उत्तरप्रदेश की प्रगति की प्रतिज्ञाएं
👉टिकटों में महिलाओं की 40 सीट प्रतिशत हिस्सेदारी
👉लड़कियों को स्मार्टफोन और स्कूटी
👉किसानों का पूरा कर्जा माफ
👉2500 में गेहूं-धान, 400 पाएगा गन्ना किसान
👉बिजली बिल सबका हाफ, कोरोना काल का बकाया साफ #कांग्रेस_की_प्रतिज्ञाएँ pic.twitter.com/KUFH148zud
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 23, 2021
Related News
Indira Gandhi : దేశం కోసం ఇందిరాగాంధీ నగలిచ్చారా ? ప్రధాని మోడీ ‘మంగళసూత్రాల’ ఆరోపణ నిజమేనా ?
Indira Gandhi : ఈ ఎన్నికల వేళ దేశంలో ప్రస్తుతం ఇద్దరు నేతల ప్రసంగాలపై అంతటా హాట్ డిబేట్ జరుగుతోంది.