Death Threat : జనవరి 26న సీఎంను హత్య చేస్తాం.. పన్నూ మరో వార్నింగ్
Death Threat : అమెరికాలో ఆశ్రయం పొందుతున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బరితెగించి భారత్కు వ్యతిరేకంగా మాట్లాడాడు.
- By Pasha Published Date - 03:48 PM, Tue - 16 January 24
- యూకే-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన గురుపత్వంత్ సింగ్ పన్నూ ఒక ఖలిస్తాన్ ఉగ్రవాది.
- ఇతనికి పాకిస్తాన్, ఐఎస్ఐతో లింకులు కూడా ఉన్నాయి.
- పన్నూ నడిపే సిక్ ఫర్ జస్టిస్ సంస్థను ఉగ్రసంస్థగా భారత్ గుర్తించింది.
- ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలతో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా కోరిక మేరకు చెక్ రిపబ్లిక్ అధికారులు గతేడాది జూన్లో అరెస్ట్ చేశారు.
- ప్రస్తుతం నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్నాడు.
- ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో నిందితుడైన భారత్కు చెందిన నిఖిల్ గుప్తాకు ఆధారాలు అందజేతకు అమెరికా నిరాకరించింది.
- ప్రస్తుతం ప్రాగ్ జైల్లో ఉన్న అతడిని అధీనంలోకి తీసుకోవడం కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.
- ఈ క్రమంలోనే జనవరి 4న గుప్తా తరఫు న్యాయవాది.. న్యూయార్క్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
- ఈ కేసులో నిఖిల్ గుప్తా న్యూయార్క్ కోర్టులో హాజరైనప్పుడు మాత్రమే తాము ఆధారాలను అందజేస్తామని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.
- దేశపౌరుడు అనే కారణాన్ని చూపించి.. ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూను రక్షించేందుకు అమెరికా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ పరిణామాలు అద్దంపడుతున్నాయి.
Also Read: YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల.. ప్రకటించిన పార్టీ అధిష్టానం
Related News
Delhi Liquor Scam: తీహార్ జైలుకు పంజాబ్ సీఎం
ఆప్ కన్వీనర్. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో రెండోసారి తీహార్లో భేటీ కానున్నారు. ఏప్రిల్ 30 మధ్యాహ్నం ఇద్దరు నేతలు భేటీ కానున్నారు.