Gold Price Today: దేశ వ్యాప్తంగా నేటి బంగారం, వెండి ధరలివే.. 24 క్యారెట్ల తులం ధర ఎంతంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,640గా ఉంది.
- Author : Gopichand
Date : 25-04-2023 - 8:50 IST
Published By : Hashtagu Telugu Desk
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,640గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,700గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.80,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళవారం (ఏప్రిల్ 25, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,840 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,850గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,140 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,240గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,640 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,700 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,700గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,750గా ఉంది.
Also Read: KTR : జహీరాబాద్లో 1000 కోట్లతో మహేంద్ర ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ ప్లాంట్.. KTR శంకుస్థాపన..
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,400 ఉండగా, ముంబైలో రూ.76,400గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000 ఉండగా, కోల్కతాలో రూ.76,400గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,000 ఉండగా, కేరళలో రూ.80,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.80,000 ఉండగా, విజయవాడలో రూ.80,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.