Manipur Women Naked Parade : నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళల కుటుంబాల గుండెగోడు ఇదీ
Manipur Women Naked Parade : మణిపూర్ లో మానవత్వం మంట కలిసింది.. ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించారు.. యావత్ దేశం తల దించుకునేలా మే 4న జరిగిన ఈ అమానుష ఘటనలో బాధితులుగా మారిన రెండు కుటుంబాల గుండె గోడు ఇదీ..
- By Pasha Published Date - 06:37 AM, Sat - 22 July 23
Manipur Women Naked Parade : మణిపూర్ లో మానవత్వం మంట కలిసింది..
ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించారు..
యావత్ దేశం తల దించుకునేలా మే 4న జరిగిన ఈ అమానుష ఘటనలో బాధితులుగా మారిన రెండు కుటుంబాల గుండె గోడు ఇదీ..
మణిపూర్ హింసాకాండలో మే 4న ఓ యువతిని నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారం చేసిన దురాగతాన్ని దేశం యావత్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ఘటనలో యువతి సోదరుడు, తండ్రిని దుండగులు దారుణంగా హత్య చేశారు. యువతిని, ఆమె తల్లిని ప్రాణాలతో వదిలిపెట్టినప్పటికీ.. వాళ్ల గుండెలపై చేసిన గాయం జీవితంలో మర్చిపోలేని స్థాయిలో ఉంది. ఈ సందర్భంగా బాధిత యువతి తల్లి ఓ జాతీయ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆవేదనను వెళ్లగక్కారు. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె(Manipur Women Naked Parade) కొన్ని నిమిషాలకు మించి మాట్లాడలేని స్థితిలో హింసను ఆపలేని, ప్రజలను రక్షించలేని మణిపూర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన విషయాలు..
Also read : Rudraksha: రుద్రాక్ష ధరిస్తే కష్టాలు పోయి, లక్ష్మీదేవి కరుణిస్తుందా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
మా ఊరికి వెళ్లే ఆలోచనే చేయను
‘హింసాకాండ భయంతో నేను, నా కూతురు, భర్త, కుమారుడు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు బయల్దేరాం. దారిలో వందలాది మంది దుండగులు మమ్ములను చుట్టుముట్టారు. మేం పోలీసుల వద్దకెళ్లి సాయం అడిగినా పట్టించుకోలేదు. మా నలుగురిని బంధించిన దుండగులు నా కుమార్తెను నగ్నంగా ఊరేగించేందుకు సిద్ధమయ్యారు. ఎదిరించిన నా కుమారుడిని, భర్తను కిరాతకంగా చంపేశారు. తర్వాత నగ్నంగా ఊరేగించి ఆమెపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. నన్ను కూడా హింసించారు. నా ఆశాకిరణమైన చిన్న కొడుకును పోగొట్టుకున్నాను. నేను చాలా కష్టపడి స్కూల్కు పంపిస్తే 12వ తరగతి పూర్తి చేశాడు. ఇప్పుడు వాడు లేడు. వాళ్ల నాన్న కూడా లేడు. నా పెద్ద కొడుకుకు ఉద్యోగం లేదు. ఇక నా కుటుంబం ఎలా గడుస్తుందో ఆ దేవుడికే ఎరుక. నా కుటుంబ భవిష్యత్తు నిరాశాశాజనకంగా ఉంది. మేము మళ్లీ మా ఊరికి వెళ్లే అవకాశమే లేదు. ఆ ఆలోచన కూడా నా మదిలోకి రాదు. మా ఇళ్లు తగులబెట్టారు. మా పొలాలు ధ్వంసం చేశారు. నా గ్రామం కాలిపోయింది. అక్కడ మాకు ఇంకా ఏం మిగిలి ఉందని..?’ అంటూ బోరుమన్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. 15 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
దేశాన్ని కాపాడాను.. కానీ భార్యను కాపాడుకోలేకపోయాను: మణిపూర్ బాధితురాలి భర్త
మణిపూర్ లో నగ్నంగా ఊరేగించిన మరో బాధిత మహిళ భర్త.. ఇండియన్ ఆర్మీలో పనిచేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానవీయ ఘటనపై స్పందించిన బాధితురాలి భర్త ఒక మాజీ సైనికుడు. కార్గిల్ యుద్ధంలో దేశాన్ని రక్షించిన తాను.. భర్తగా తన భార్యను మాత్రం ఇలాంటి ఘటన నుంచి కాపాడుకోలేకపోయానని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో భాగంగా శ్రీలంకలోనూ పనిచేసినట్లు ఆయన చెప్పాడు.
Also read : Rain Water: వరుస అప్పులతో సతమతమవుతున్నారా.. అయితే వర్షపు నీటితో ఇలా చేయాల్సిందే?
అసలు ఏం జరిగింది ?
మణిపూర్లో లోయ ప్రాంతంలో ప్రాబల్యం కలిగిన మైతైలకు, పర్వత ప్రాంతాల్లో ప్రాబల్యం కలిగిన కుకీలకు మధ్య మే 3న ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తమకు ఎస్టీ హోదా కల్పించాలని మైతైలు డిమాండ్ చేయడం వివాదానికి దారి తీసింది. పర్వత ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించడంతో అల్లర్లు చెలరేగాయి. తమ వర్గానికి చెందిన మహిళలపై లైంగికదాడులకు పాల్పడ్డారన్న వదంతులు వ్యాపించడంతో ఓ వర్గం వారు మరో వర్గం వారిపై దాడులకు దిగారు. ఈ క్రమంలో మే 4న బీ.ఫయనోమ్ గ్రామానికి చెందిన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరిలో 56 ఏండ్ల వ్యక్తి, అతడి కుమారుడు(19) , కుమార్తె (21) ఓ కుటుంబానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు ఇతర మహిళలు ఉన్నారు. అడవిలోకి వెళ్తుండగా వీరికి నాంగ్పోక్ సెక్మై పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసుల బృందం కనిపించింది. పోలీస్ స్టేషన్కు 2 కిలోమీటర్ల దూరంలో, 800-1000 మందితో కూడిన భారీ గుంపు వీరిని అడ్డగించింది. పోలీసుల నుంచి ఈ ఐదుగురి బృందాన్ని అపహరించి దాడికి దిగింది. మూక నుంచి తన సోదరిని రక్షించే క్రమంలో యువకుడితోపాటు అతడి తండ్రి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ పంట పొలాల్లోకి తీసుకెళ్లింది. ఈ క్రమంలో కొందరు యువకులు ఆ యువతులను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా వ్యవహరించారు. ఓ యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు బాధిత కుటుంబం పోలీసులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ మేరకు మే 18న జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం మే 21న నాంగ్పోక్ సెక్మై పోలీస్ స్టేషన్కు కేసును బదిలీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి హెరాదాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. అయితే మే నెలలోనే ఈ అమానుష ఘటన జరిగినప్పటికీ, రెండు నెలలు గడిచినా నిందితులను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Related News
KTR : దేవెగౌడ మనవడు పారిపోయేందుకు మోడీ సర్కారు సాయం : కేటీఆర్
KTR : మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ కొడుకు హెచ్డీ రేవణ్ణ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వ్యవహారంపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ స్పందించారు.