Rain Water: వరుస అప్పులతో సతమతమవుతున్నారా.. అయితే వర్షపు నీటితో ఇలా చేయాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ అవి మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందన
- By Nakshatra Published Date - 10:30 PM, Fri - 21 July 23
ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ అవి మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని దిగులు చెందుతూ ఉంటారు. ఇంకొందరు ఎంత కష్టపడినా కూడా చేతిలో డబ్బులు వినడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలుగా సతమతమవడంతో పాటు అప్పు మీద అప్పు చేస్తూ ఉంటారు. అలా అప్పుల పాలు అవుతున్నవారు వర్షపు నీటితో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మరి ఆర్థిక సమస్యలు పోవాలంటే వర్షం ఏంటో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అప్పు తీర్చలేకపోతే ఒక బకెట్లో వర్షపు నీటిని సేకరించి అందులో పాలు పోసి భగవంతుడిని స్మరించుకుని ఈ నీళ్లలో ఒక నెలపాటు స్నానం చేయాలి. అలా చేయడం వల్ల క్రమంగా మీ అప్పు తగ్గడం ప్రారంభం అవుతుంది. వ్యాపారంలో నష్టం వాటిల్లితే ఇత్తడి పాత్రలో వర్షపు నీటిని సేకరించి ఏకాదశి రోజున ఈ నీటితో అమ్మవారికి, విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి. ఈ పరిహారాన్ని కూడా చాలా మంది నమ్ముతారు. అలాగే మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే మట్టి కుండలో వర్షపు నీటిని సేకరించి ఇంటికి ఈశాన్య లేదా ఉత్తరం వైపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.
అలాగే ఒక గిన్నెలో వర్షపు నీటిని నింపి పైకప్పుపై ఉంచి ఆ తర్వాత మీకు ఇష్ట దైవాన్ని తలచుకుంటూ మామిడి ఆకుతో ఇంట్లో నీటిని చల్లాలని కూడా నమ్ముతారు. తల్లి లక్ష్మి ఈ పరిహారంతో సంతోషిస్తుంది. డబ్బు కొరతను కూడా ఉండదు. అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరికైనా వివాహంలో ఇబ్బంది ఉంటే, వర్షపు నీటిని సేకరించి గణేశుడికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఏ రకమైన వ్యాధి లేదా ఏదైనా సంక్షోభం ఉంటే, వర్షం నీటిని సేకరించి, మహామృత్యుంజయ మంత్రంతో శివునికి అభిషేకం చేయడం మంచిది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంది అనుకుంటే ఏదైనా పాత్రలో వర్షపు నీటిని సేకరించి ఆంజనేయుడి ముందు ఉంచాలి. ఈ నెలలో ప్రతిరోజూ 51 హనుమాన్ చాలీసాను పటించాలి. ఆ తర్వాత ఆ నీటిని ఇంట్లోని ప్రతి భాగానికి చల్లాలి. ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది.
Related News
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు..! ఎప్పుడంటే..?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత 2024కి ఇంకా తేదీ నిర్ణయించబడలేదు.