Former Minister Son Dies: మాజీ మంత్రి కుమారుడు ఆత్మహత్య
హర్యానా రాష్ట్ర మాజీ మంత్రి మంగేరామ్ కుమారుడు (Former Minister Son Dies) జగ్దీష్ విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేయబడింది. వారిలో ఇండియన్ నేషనల్ లోక్దళ్(INLD) స్టేట్చీఫ్ నఫే సింగ్ కూడా ఉన్నారు.
- Author : Gopichand
Date : 13-01-2023 - 8:55 IST
Published By : Hashtagu Telugu Desk
హర్యానా రాష్ట్ర మాజీ మంత్రి మంగేరామ్ కుమారుడు (Former Minister Son Dies) జగ్దీష్ విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేయబడింది. వారిలో ఇండియన్ నేషనల్ లోక్దళ్(INLD) స్టేట్చీఫ్ నఫే సింగ్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వసీం అక్రం వెల్లడించారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
హర్యానా మాజీ మంత్రి మంగేరామ్ కుమారుడు, బీజేపీ నేత జగదీష్ నంబర్దార్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మృతికి INLD రాష్ట్ర అధ్యక్షుడు నఫే సింగ్ రాఠీ సహా 6 మంది కారణమని బంధువులు ఆరోపించారు. ఆరోపణల ఆధారంగా సిటీ పోలీసులు ఐపిసి సెక్షన్ 306, 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు కూడా ముఖ్యమంత్రిని కలిసి న్యాయం చేయాలని వేడుకుంది. మరోవైపు కేసు తీవ్రత దృష్ట్యా ఎస్పీ జజ్జర్ సిట్ను ఏర్పాటు చేశారు.
Also Read: Sharad Yadav Passes Away: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
వాస్తవానికి బుధవారం మధ్యాహ్నం జగదీష్ నంబర్దార్ తన కార్యాలయంలో విషపదార్థం తీసుకున్నాడు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రకటించారు. సమాచారం అందిన వెంటనే బంధువులు ఆసుపత్రి వైపు పరుగులు తీయగా, పోలీసులు కూడా అక్కడకి చేరుకున్నారు. ఆయన మరణానికి కొద్ది రోజుల ముందు జగదీష్ ఆడియో క్లిప్ ఇంటర్నెట్ మీడియాలో వైరల్గా మారింది. ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఆడియోలో పేర్కొన్నాడు. వివిధ రాజకీయ సంఘాలకు చెందిన వారు ఆస్పత్రికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ వసీం అక్రమ్ స్వయంగా బహదూర్ఘర్కు చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.