Building Collapse : కోల్కతాలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
- By Latha Suma Published Date - 10:22 AM, Mon - 18 March 24
Building Collapse : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా(Kolkata)లో నిర్మాణంలో (Building Collapse) ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది(Building Collapse). ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు 13 మందిని రక్షించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాకా గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఓ కాలనీలో ఈ ఘటన జరిగింది.
#WATCH | West Bengal CM Mamata Banerjee says, "… Rescue work was started immediately after the accident. Two people have died, 5-6 people are still trapped inside, they will also be rescued soon. Officials from medical, fire and other departments are deployed. The building was… pic.twitter.com/ExUv1nxkbS
— ANI (@ANI) March 18, 2024
We’re now on WhatsApp. Click to Join.
సమాచారం అందుకున్న పోలీసులు(police ), రెస్క్యూ సిబ్బంది(Rescue personnel) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వాళ్లను హుటాహుటిన దవాఖానకు తరలించారు. సోమవారం ఉదయం రంగంలోకి దిగిన 50 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ ప్రస్తుతం అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నది. కాగా, భవనంలో ఎవరూ లేరని స్థానికులు తెలిపారు. కానీ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న గుడిసెలపై శిథిలాలు పడ్డాయని చెప్పారు. ఇంకా పదుల సంఖ్యలో శిథిలాల్లో చిక్కుకుని ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
read also: Telangana SSC: కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎస్ఎస్సీ పరీక్షలు ప్రారంభం
ఘటనా స్థలాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సందర్శించారు. సహాయక చర్యలను గురించి అధికారులను అడిగితెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహాయం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ఇద్దరు మరణించారని, మరో ఐదారుగురు శిథిలాల్లో చిక్కుకుపోయారని చెప్పారు. మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.
Related News
Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు ప్రధాన అంశాలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగం వీడియోను ఎడిట్ చేసినందుకు గానూ ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఏప్రిల్ 30 న తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను కలవనున్నారు. పశ్చిమ బెంగాల్ మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్కు సహాయం చేస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేశారు.