HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Explainer If Not Ambedkar Who Wrote The Indian Constitution

Indian Constitution: భారత రాజ్యాంగం.. డా. అంబేద్కర్ ఒక్కరే రాశారా?

రాజ్యాంగ సభ, రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేయడానికి ఆగస్టు 29, 1947న ప్రారంపక కమిటీని ఏర్పాటు చేసింది.దీనికి డా. బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కమిటీలో ఆయనతో పాటు మరో ఏడుగురు సభ్యులు ఉన్నారు.

  • Author : Gopichand Date : 26-11-2025 - 5:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indian Constitution
Indian Constitution

Indian Constitution: భారత పార్లమెంటు అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. అయితే భారత రాజ్యాంగానికి (Indian Constitution) సంబంధించి దేశంలో ఎప్పుడూ రెండు వర్గాలు కనిపిస్తాయి. మొదటి వర్గం రాజ్యాంగాన్ని డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ మాత్రమే రచించారని చెబుతుండగా.. రెండో వర్గం ఈ వాదనను అంగీకరించదు. చరిత్రలో దీని గురించి స్పష్టమైన ప్రస్తావన ఉన్నప్పటికీ ప్రారంభం నుంచీ ప్రజల్లో గందరగోళం లేదా తమ తమ అభిప్రాయాలపై పట్టుదల కొనసాగుతోంది. ఈ పూర్తి సంఘటనను తార్కిక వివరణతో మీకు అందిస్తున్నాము.

రాజ్యాంగ రచనకు దారి తీసిన సంఘటనలు

దేశంలో విప్లవ దశ నడుస్తోంది. స్వాతంత్య్రం సమరం మొదలైంది. భారత్ బ్రిటిష్ పాలనలో ఉన్నప్పటికీ స్వాతంత్య్రపు శంఖారావం మోగింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జూలై 1945లో బ్రిటన్ భారతదేశం కోసం తన కొత్త విధానాన్ని ప్రకటించింది.

19 సెప్టెంబర్, 1945న వైస్రాయ్ లార్డ్ వేవెల్ భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర శాసనసభలకు డిసెంబర్ 1945 నుండి జనవరి 1946 వరకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల తర్వాత ఒక కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేయబడుతుందని, అదనంగా ఒక రాజ్యాంగ-నిర్మాణ సంస్థ కూడా ఏర్పాటు చేయబడుతుందని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. భారతదేశంలో రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడానికి బ్రిటన్ ముగ్గురు మంత్రులతో కూడిన క్యాబినెట్ మిషన్‌ను పంపింది.

Also Read: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చ‌నిపోయారా? 3 వారాలుగా కుటుంబానికి నో ఎంట్రీ!

రాజ్యాంగ సభ ఏర్పాటు

రాజ్యాంగ సభలో ఎన్నికైన సభ్యులందరూ ఉన్నారు. ఈ సభ రాజ్యాంగ ముసాయిదాను తయారు చేయవలసి ఉంది. రాజ్యాంగ సభ మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946న జరిగింది. డా. రాజేంద్ర ప్రసాద్ సభకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 389 మంది సభ్యులు ఎన్నికల్లో గెలిచినప్పటికీ, దేశ విభజన తర్వాత భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు మిగిలారు.

ముసాయిదా కమిటీ ఏర్పాటు

రాజ్యాంగ సభ, రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేయడానికి ఆగస్టు 29, 1947న ప్రారంపక కమిటీని ఏర్పాటు చేసింది.దీనికి డా. బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కమిటీలో ఆయనతో పాటు మరో ఏడుగురు సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ సలహాదారు అయిన బి.ఎన్. రావు మొదట రాజ్యాంగం ప్రాథమిక ముసాయిదాను తయారు చేశారు. ఆ తర్వాత, డ్రాఫ్టింగ్ కమిటీ బి.ఎన్. రావు తయారుచేసిన ముసాయిదాను చట్టపరమైన పత్రంగా మార్చింది. రాజ్యాంగ సభ డ్రాఫ్టింగ్ కమిటీ 2 సంవత్సరాలు, 11 నెలలు, 18 రోజులు కష్టపడింది. ఈ కృషి తర్వాత నవంబర్ 26, 1949న రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఇది జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ సభ 1950లో స్వతంత్ర భారతదేశం మొదటి పార్లమెంట్‌గా పనిచేసింది.

అంబేద్కర్ పాత్ర

మరింత సరళమైన భాషలో చెప్పాలంటే.. డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ కేవలం డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు మాత్రమే. బి.ఎన్. రావు రాజ్యాంగ సలహాదారుగా, రాజ్యాంగం మొదటి ముసాయిదాను తయారు చేశారు. ఆ తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీలోని 7 గురు సభ్యులు సుమారు 3 సంవత్సరాల సమయం వెచ్చించి, ఆ ముసాయిదాను మెరుగుపరిచారు. అవసరమైన మార్పులు చేశారు. అనంతరం డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు డా. భీమ్‌రావు అంబేద్కర్ తుది ముసాయిదాను రాజ్యాంగ సభ అధ్యక్షుడు డా. రాజేంద్ర ప్రసాద్‌కు సమర్పించారు. రాజ్యాంగ సభ, మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఆ ముసాయిదాను భారతదేశ రాజ్యాంగంగా మలచింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BR Ambedkar
  • constitution day
  • Indian Constitution
  • Indian Constitution Day
  • Special News

Related News

Donald Trump

భారత్‌తో మా బంధం దృఢమైంది రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Donald Trump  భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రభుత్వానికి, ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా, భారత్‌ల మధ్య చారిత్రాత్మక బంధం ఉందని ఆయన కొనియాడారు. సోమవారం ట్రంప్ సందేశాన్ని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్

  • India Republic Day

    రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Latest News

  • మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు

  • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

  • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

  • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

  • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

Trending News

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

    • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

    • పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ

    • అజిత్ పవార్‌ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!

    • అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd