CBSE Paper Issue : వివాదంలో ‘సీబీఎస్ఈ’ పశ్నాపత్రం
సీబీఎస్ఈ ఇంగ్లీషు,సోషయాలజీ పేపర్ వివాదస్పదం అయింది. 10 తరగతి ఇంగ్లీషు ప్రశ్నపత్రంలోని ఒక ప్యాసేజ్ లింగ సమానత్వాన్ని ప్రశ్నించేలా ఉంది. తిరోగమన భావాలకు మద్ధతు ఇచ్చేలా ఉంది. ఆ విషయాన్ని ఎత్తిచూపుతూ రాహుల్, ప్రియాంకగాంధీ ట్వీట్ చేశారు. మోడీ సర్కార్ వాలకాన్ని ఆ ట్వీట్ లో ప్రశ్నించారు.
- By CS Rao Published Date - 03:27 PM, Mon - 13 December 21
సీబీఎస్ఈ ఇంగ్లీషు,సోషయాలజీ పేపర్ వివాదస్పదం అయింది. 10 తరగతి ఇంగ్లీషు ప్రశ్నపత్రంలోని ఒక ప్యాసేజ్ లింగ సమానత్వాన్ని ప్రశ్నించేలా ఉంది. తిరోగమన భావాలకు మద్ధతు ఇచ్చేలా ఉంది. ఆ విషయాన్ని ఎత్తిచూపుతూ రాహుల్, ప్రియాంకగాంధీ ట్వీట్ చేశారు. మోడీ సర్కార్ వాలకాన్ని ఆ ట్వీట్ లో ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం ఆ ప్రశ్నాపత్రంలో చొప్పించారని ఆరోపించారు. అంతేకాదు, ఈ నెల ప్రారంభంలో, CBSE క్లాస్ 12 సోషియాలజీ పేపర్ లోని అంశాన్ని కూడా లేవనెత్తారు. “2002లో గుజరాత్లో ముస్లిం వ్యతిరేక హింస” ఏ పార్టీ కింద జరిగిందో చెప్పమని ఒక ప్రశ్న ఉండడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది. సీబీఎస్ ఈ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ప్రశ్నా పత్రాలు ఉన్నాయని ట్వీట్టర్ వేదికగా రాహుల్, ప్రయాంక ఆగ్రహించారు.తల్లిదండ్రుల అధికారాన్ని మహిళలు నాశనం చేస్తున్నారన్న భావనతో సీబీఎస్ఈ ఇంగ్లీషు ప్రశ్నాపత్రంలో ప్యాసేజ్ ఉంది. భర్త మార్గాన్ని తల్లి అనుసరించాలని ఆ పాసేజ్ లోని సారాంశం. దీనితో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై విరుచుకుపడ్డారు, ఈ పాసేజ్ “అసహ్యకరమైనది” అని రాహుల్ ట్వీట్ చేశాడు. సీబీఎస్ ఈ ఇచ్చిన ఈ పాసేజ్ ను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడంతో వివాదం నెలకొంది.కొందరు స్వేచ్ఛగా ఉండే మహిళల కారణంగా తల్లిదండ్రులు అధికారాన్ని కోల్పోతున్నారని ఇచ్చిన ఆ పాసేజ్ మీద సీబీఎస్ఈ బోర్డు కూడా స్పందించింది. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నందున, జవాబు పత్రాలను పరిశీలించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని వివరణ ఇచ్చింది. మొత్తం మీద సీబీఎస్ఈ 10వ తరగతి ప్రశ్నాపత్రాలను కూడా రాజకీయంగా వాడుకోవడం శోచనీయం.
Tags
Related News
CBSE: ఓపెన్ బుక్ ఎగ్జామ్ పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కసరత్తు
CBSE: ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే ఏంటి? Education: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (CBSE) పరిధిలో 9, 10 తరగతులకు ఇంగ్లిష్, గణితం (Mathematics), సైన్స్ పరీక్షలను ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానాన్ని నిర్వహించనున్నారు. 11, 12 తరగతుల విద్యార్థులకు గణితం, బయాలజీ సబ్జెక్టులను ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానంలో నిర్వహించనున్నారు. పరీక్షలు అంటేనే నేర్చుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకుని రాయడం.. అలా చేయలేనివారు దొం�