Election Survey : మళ్లీ భారత్ బాద్ షా మోడీ, ఇండియా టుడే-సీ వోటర్ సర్వే
ఎవరు అధికారంలోకి వస్తారు? ప్రజల నాడి ఎలా ఉంది? అనే ప్రశ్నలకు
- By CS Rao Published Date - 01:15 PM, Fri - 27 January 23
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారు? దేశ వ్యాప్తంగా ప్రజల నాడి ఎలా ఉంది? అనే ప్రశ్నలకు ఇండియా టుడే- సీ వోటర్ (Election Survey) సర్వే సమాధానం ఇచ్చింది. మరోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ (PM Modi) తిరుగులేకుండా అవుతారని తేల్చేసింది. కాంగ్రెస్ పార్టీ గతం కంటే కొంత మెరుగు పడింది. అయినప్పటికీ బీజేపీకి 284 సీట్లను గెలుచుకుంటుందని సర్వే చెబుతోంది. కాంగ్రెస్ పార్టీతో కూడిన యూపీఏ 153 మంది ఎంపీలను గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది.
ఇండియా టుడే- సీ వోటర్ (Election Survey)
దేశ వ్యాప్తం ఎన్నికల మూడ్ ఉన్న క్రమంలో ఇండియా టుడే-సీ వోటర్ ఈ సర్వే(Election Survey)ను చేసింది. ప్రస్తుతం రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. ప్రధాన మంత్రి అభ్యర్థిత్వాల రేసులో బెంగాల్ సీఎం మమత, ఆప్ చీఫ్ కేజ్రీవాల్, బీహార్ సీఎం నితీష్, ఎన్సీపీ నేతలు శరద్ పవార్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. ఎవరికి వాళ్లే జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి అభ్యర్థులుగా ఫోకస్ కావడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మూడ్ ను తెలుసుకునేందుకు చేసిన సర్వేలో మోడీకి(PM Modi) ప్రజలు మరోసారి పట్టంకడతారని తేలింది. కేవలం బీజేపీ ఒంటరిగా 284 స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది. బీజేపీతో కూడిన ఎన్డీయే 298 స్థానాలను కైవసం చేసుకునేలా పబ్లిక్ మూడ్ ఉందని సర్వే సారాంశం.
Also Read : Survey On TRS: ఐప్యాక్ సంచలన సర్వే.. కేసీఆర్ కు గడ్డుకాలమే!
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే సాధారణ ప్రజల మూడ్ను సర్వే అంచనా వేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సర్వే చెబుతోంది. 543 లోక్సభ స్థానాలకు గాను ఎన్డీయే 298 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్నే తృత్వంలోని యుపిఎ తన పనితీరును మెరుగుపరుచుకుంటూ 153 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు దాదాపు 92 సీట్లు గెలుచుకోవచ్చని చెబుతోంది. ఎన్డీయే ఓట్ల శాతం 43 శాతం ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 29 శాతం, ఇతరులకు 28 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.సర్వే ప్రకారం, ఈరోజు ఎన్నికలు జరిగితే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఒంటరిగా 284 సీట్లు వచ్చే అవకాశం ఉంది. సౌకర్యవంతమైన మెజారిటీ కాంగ్రెస్కు 68, ఇతరులకు 191 సీట్లు వచ్చే అవకాశం ఉంది. పార్టీల వారీగా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే, బీజేపీకి 39 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్కు 22 శాతం, ఇతరులకు 39 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది.
ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే
2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వచ్చి వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 303 సీట్లు గెలుచుకోగా, ఎన్డీయేకు 353 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ 91 సీట్లతో సహా కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఇప్పడికిప్పుడు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ పార్టీ కంటే ఇతరులకు ఎక్కువగా ఓట్లు, సీట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అంటే, విపక్షాల్లోని అనైక్యత బీజేపీ విజయానికి బాటలు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 22శాతం మాత్రమే ఓటు బ్యాంకు ఉందని సర్వే తేల్చింది. అదే ఇతరులకు 39శాతం ఓటు బ్యాంకు ఉందని చెబుతోంది. ఈ లెక్కన ఇతరులను కలుపుకుని కాంగ్రెస్ పార్టీ వెళ్లకపోతే మరోసారి అభాసుపాలు కావాల్సి వస్తుంది.
Also Read : Atmasakshi Survey: `ఆత్మసాక్షి` లేటెస్ట్ సర్వే.. ‘బాబు’ వైపు ఏపీ మూడ్!
Tags
Related News
Lok Sabha Polls 2024: తెలంగాణకు క్యూ కడుతున్న ఢిల్లీ బీజేపీ పెద్దలు
రాష్ట్రంలో లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు, ఈ సందర్భంగా వరంగల్ తో పాటు రెండు మూడు చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో పార్టీ చేస్తున్న ప్రచారం