Byjus CEO: దేశం విడిచి వెళ్లొద్దు..బైజూస్ సీఈవో కోసం ఈడీ లుకౌట్ నోటీసులు
- By Latha Suma Published Date - 01:32 PM, Thu - 22 February 24
Byjus CEO : బైజూస్ సీఈవో(Byjus CEO) రవీంద్రన్(raveendran) కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate)లుకౌట్ నోటీసు జారీ చేసింది. లుకౌట్ నోటీసు(look out notice) జారీ చేయాలని ఇమ్మిగ్రేషన్ బ్యూరోను ఈడీ కోరింది. బైజూస్ విద్యా సంస్థ సీఈవో దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఈడీ చర్యలు తీసుకుంటోంది. బైజూస్ పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ సంస్థకు గత ఏడాది నవంబర్లో షోకాజు నోటీసులు జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఫెమా ఉల్లంఘనల కింద రవీంద్రన్కు కూడా ఫిర్యాదు ఇచ్చారు. సుమారు 9362 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు రవీంద్రన్పై ఆరోపణలు ఉన్నాయి. రవీంద్రన్ కోసం ఎల్ఓసీ ఓపెన్ చేసినట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఫెమా చట్టాలకు వ్యతిరేకంగా విదేశాలకు డబ్బును పంపించారని, దాని వల్ల కేంద్ర సర్కారుకు రెవన్యూ నష్టం జరిగినట్లు ఈడీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
read also : Best Tourist Places In Telangana : తెలంగాణలో ఈ ప్రదేశాలకు వెళ్తే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు..
థింక్ అండ్ లెర్న్ ప్రైవేటు కంపెనీపై గత ఏడాది ఏప్రిల్ 27, 28 తేదీల్లో ఈడీ సోదాలు చేసింది. రవీంద్రన్ ఇంట్లోనూ తనిఖీలు జరిగాయి. పెట్టుబడులకు చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ సమయంలో రవీంద్రన్తో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వాంగ్మూలాన్ని తీసుకున్నారు.
Related News
Anna Hazare : కేజ్రీవాల్ పై అన్నా హజారే విమర్శలు
Anna Hazare: సామాజిక కార్యకర్త అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా కలిసి పోరాడిన అన్నా హజారే మద్యం కుంభకోణంపై కేజ్రీవాల్పై విరుచుకుపడ్డారు. దేశ రాజకీయాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా.. ప్రతి ఒక్కరూ సరైన అభ్యర్థిని ఎన్నుకోవా�