ED Vs Kejriwal : నాలుగోసారి కేజ్రీవాల్కు ఈడీ సమన్లు.. విచారణ తేదీ ఎప్పుడంటే ?
ED Vs Kejriwal : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి యాక్షన్ మొదలుపెట్టింది.
- By Pasha Published Date - 10:28 AM, Sat - 13 January 24
ED Vs Kejriwal : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి యాక్షన్ మొదలుపెట్టింది. ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాలుగోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ వ్యవహారంలో జనవరి 18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవాల్కు ఇప్పటికే మూడుసార్లు సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో తమ ఎదుట హాజరు కావాలని దర్యాప్తు సంస్థ నాలుగోసారి ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు జనవరి 3న మూడోసారి ఈడీ సమన్లు జారీ చేయడంపై కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. ‘‘ఈడీ సమన్లు చట్టవిరుద్ధమైనవి. రాజకీయ ప్రేరేపితమైనవి. అవి అక్రమమైనవి. బీజేపీ సూచన మేరకే వాటిని పంపారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నన్ను దూరం చేసేందుకే ఈ సమన్లను జారీ చేశారు. తక్షణమే సమన్లను ఉపసంహరించుకోవాలి’ అని కేజ్రీవాల్(ED Vs Kejriwal) వ్యాఖ్యానించారు.
పంజాబ్ సహా ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలన్న వైఖరికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కట్టుబడి ఉందని, ఇప్పటివరకు జరిగిన చర్చలు సానుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ ఇటీవల తెలిపారు. ఆప్, కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో భాగంగా ఉన్నాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై రెండు పార్టీలు చర్చలు జరిపాయి. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు ప్రారంభమయ్యాయని.. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గోవా, గుజరాత్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయాలన్న వైఖరికి తమ పార్టీ కట్టుబడి ఉందని గోపాల్ రాయ్ తెలిపాయి. ఆప్ పోటీ చేసే సీట్ల గురించి ప్రశ్నించగా ఈ రాష్ట్రాలలో నిర్దిష్టంగా ఏయే సీట్లలో పోటీచేయాలన్న దానిపై చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ, పంజాబ్లో ఆప్ అధికారంలో ఉంది. అయితే ఈ రెండు రాష్ట్రాలలో ఆప్తో ఎన్నికల పొత్తును కాంగ్రెస్ రాష్ట్ర శాఖలు వ్యతిరేకిస్తున్నాయి.
Related News
Anna Hazare : కేజ్రీవాల్ పై అన్నా హజారే విమర్శలు
Anna Hazare: సామాజిక కార్యకర్త అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా కలిసి పోరాడిన అన్నా హజారే మద్యం కుంభకోణంపై కేజ్రీవాల్పై విరుచుకుపడ్డారు. దేశ రాజకీయాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా.. ప్రతి ఒక్కరూ సరైన అభ్యర్థిని ఎన్నుకోవా�