Election Commission of India : ఓటు తొలగించాలంటే ఈ-వెరిఫికేషన్ తప్పనిసరి
Election Commission of India : భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ఓటరు జాబితాల్లో మార్పులు మరింత పారదర్శకంగా ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది
- By Sudheer Published Date - 10:10 AM, Thu - 25 September 25

భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ఓటరు జాబితాల్లో మార్పులు మరింత పారదర్శకంగా ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరు తమ ఓటు తొలగించుకోవాలని దరఖాస్తు చేసినా, వారికి లింక్ అయిన మొబైల్ నంబర్కు OTP వస్తుంది. ఆ OTPని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఓటు తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ విధానం వల్ల తప్పుడు ఫిర్యాదులు, దుర్వినియోగాలు తగ్గుతాయని, నిజమైన ఓటర్లు మాత్రమే మార్పులను చేయగలరని అధికారులు తెలిపారు.
Chapathi: వామ్మో.. చపాతీలు రోజు తింటే అంత డేంజరా.. ఇది తెలిస్తే అస్సలు తినరు?
ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. తమ పార్టీ తరఫున ప్రశ్నించినందుకే ఎన్నికల సంఘం ఈ విధానం తీసుకువచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల బీజేపీ నేతల ప్రేరణతో కాంగ్రెస్ ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడుతున్నాయని తాను పలు మార్లు ఆరోపించానని ఆయన గుర్తుచేశారు. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేకుండా, ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసి, నిష్పాక్షికతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఈ-వెరిఫికేషన్ విధానం అమలులోకి వస్తే, భవిష్యత్లో ఓటరు జాబితాలపై అనవసర వాదనలు, అవిశ్వాసాలు తగ్గే అవకాశం ఉంది. టెక్నాలజీ సహకారంతో ఓటరుల భద్రత, విశ్వసనీయత పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ సదుపాయాలు లేని ఓటర్లు ఇబ్బంది పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, ఓటరు హక్కులను రక్షించడంలో ఈ చర్య ఒక ముందడుగుగా నిలుస్తుందని భావిస్తున్నారు.