Doctors’ Protest : కేజ్రీ, మోడీ నడుమ డాక్టర్ల సమ్మె
ఆస్పత్రులను బహిష్కరించిన వైద్యల అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాతపూర్వకంగా తీసుకెళ్లాడు. ఆస్పత్రుల్లో ఉండాల్సిన డాక్టర్లు రోడ్లపై ఉన్నారనే విషయాన్ని ప్రధానికి నివేదించాడు.
- By CS Rao Published Date - 03:52 PM, Wed - 29 December 21
ఆస్పత్రులను బహిష్కరించిన వైద్యల అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాతపూర్వకంగా తీసుకెళ్లాడు. ఆస్పత్రుల్లో ఉండాల్సిన డాక్టర్లు రోడ్లపై ఉన్నారనే విషయాన్ని ప్రధానికి నివేదించాడు. కోవిడ్ ఉధృతంగా ఉన్న ప్రస్తుత సమయంలో ఈ సమస్యను “వ్యక్తిగతంగా” పరిష్కరించడానికి మార్గాలను పరిశీలించాలని కోరాడు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG) కౌన్సెలింగ్ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాలని కూడా ఆయన తన లేఖలో ప్రధానిని కేజ్రీ వాల్ అభ్యర్థించాడు. ఒకవైపు ఓమిక్రాన్ వేరియంట్ భయంకరమైన వేగంతో విస్తరిస్తోంది, మరోవైపు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో వైద్యులు సమ్మె చేస్తున్నారు’’ అని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. అతను రాసిన లేఖ కాపీని షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు. “వైద్యులపై పోలీసుల క్రూరత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, వారి డిమాండ్లను ప్రధాని త్వరగా ఆమోదించాలని ట్వీట్ చేశాడు.
వైద్యులు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో అనేక మంది గాయపడ్డారు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ డాక్టర్లు రోడ్లపై ధర్నాకు దిగారు. పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు 12 మంది డాక్టర్లను అదుపులోకి తీసుకుని విడుదల చేశారు. విధులను బహిష్కరించిన వైద్యులు సమ్మెలను విరమించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కోరాడు. “COVID-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైద్యులు ఆసుపత్రుల్లో ఉండాలి, వీధిలో కాదు మహమ్మారి సమయంలో వారి స్వంత జీవితాల గురించి పట్టించుకోకుండా, గత ఏడాదిన్నర కాలంగా కోవిడ్ రోగులకు చికిత్స చేసిన వైద్యులు వీరే అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు.
ప్రాణాంతక వైరస్ బారిన పడి ఎంతో మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని, అయితే వారు తమ కర్తవ్యాన్ని విస్మరించలేదని, అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. NEET-PG కౌన్సెలింగ్ను పదే పదే వాయిదా వేయడం వల్ల సఫ్దర్జంగ్ మరియు రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ వంటి అనేక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులలోని రెసిడెంట్ వైద్యులు గత నెల రోజులుగా సమ్మెలో ఉన్నారు. వారి నిరంతర పోరాటం తర్వాత కూడా, ఈ రెసిడెంట్ డాక్టర్ల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వినకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తున్నదని కేజ్రీవాల్ అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు, పోలీసులు హింసాత్మకంగా ప్రవర్తించడం, వారిపై వేధింపులకు గురిచేయడం మరింత కలత చెందుతోంది” అని ముఖ్యమంత్రి ఆరోపించారు.
Related News
TS : కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయం..లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Lakshman: బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS)పై విమర్శలు గుప్పించారు. రాబోయే రోజులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు. .ప్రజలు మోడీ(Modi)ని గెలిపించాలన పట్టుదలతో పార్టీలను కాదని మోడీ వైపు మొగ్గుచూపారన్నారు. We’re now on WhatsApp. Click to Join. కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా దక్క�